Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్తో ఆప్ సెటిల్మెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై దాడి చేశాడు. ఆమెతో పీఏ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై కేజ్రీవాల్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలివాల్పై జరిగిన దాడిపై ఆప్ స్పందించిన ఒక రోజు తర్వాత సంజయ్ సింగ్, స్వాతి మలివాల్ నివాసంలో ఆమెను బుధవారం కలిశారు. సంజయ్ సింగ్ వెంట ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యురాలు వందన కూడా ఉన్నారు. ఈ దాడి ఘటనలో స్వాతి మలివాల్తో సెటిల్మెంట్ కోసమే వీరిద్దరు ఆమె నివాసానికి వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ మలివాల్ సోమవారం ఆరోపించారు. దీనిపై పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, దీనిపై స్వాతి మలివాల్ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్ మలివాల్తో “అనుచితంగా ప్రవర్తించారు” మరియు ఈ విషయంలో ఆప్ అధినేత కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ‘‘స్వాతి మలివాల్ కేజ్రీవాల్ని కలిసేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే ఆమె డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉండగా బిభవ్ కుమార్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇది అత్యంత ఖండించదగిన సంఘటన’’ అని సంజయ్ సింగ్ అన్నారు.
అయితే, ఈ వ్యవహారం ఆప్ వర్సెస్ బీజేపీగా మారింది. దీనిపై ఫిర్యాదు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ సహాయకుడిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేయడంతో పాటు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా బుధవారం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్గా పని చేసిన ఓ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ఆమెకు మద్దతు ఇచ్చేందుకు మేం ఉన్నామని, ఈ ఘటనను ఆప్ నేత సంజయ్ సింగ్ అంగీకరించారని, కేజ్రీవాల్ నిందితుడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని సచ్దేవా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!