Supreme Court: “గర్భంలో పిండానికి కూడా జీవించే హక్కు ఉంటుంది”.. అవివాహిత పిటిషన్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: గర్భంలోని పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలని 20 ఏళ్ల అవివాహిత దాఖలు చేసిన పిటిషన్ని స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు నిరాకరించింది. మే 3న తన గర్భాన్ని తొలగించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మేము చట్టానికి విరుద్ధంగా ఏ ఉత్తర్వులను జారీ చేయలేము అని ధర్మాసనం స్పష్టం చేసింది.
కడుపులో ఉన్న బిడ్డకు కూడా జీవించే హక్కు ఉంటుందని, దాని గురించి మీరు ఏం అంటారు..? అని మహిళ తరుఫు న్యాయవాదిని ప్రశ్నించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం కేవలం తల్లి గురించి మాత్రమే మాట్లాడుతుందని మహిళ తరఫు న్యాయవాది తెలిపారు. ఇది తల్లుల కోసం తయారు చేయబడిందని చెప్పారు. గర్భం దాల్చి 7 నెలలకు పైగా అయిందని ధర్మాసనం పేర్కొంది. పిల్లల మనుగడ హక్కు పరిస్థితి ఏంటి..? దీనిని మీరు ఎలా పరిష్కరిస్తారు..? అని బెంజ్ ప్రశ్నించింది. పిండం కడుపులో ఉందని, బిడ్డ ప్రసవించే వరకు అది తల్లి హక్కు అని న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
Read Also: Rameez Raza: టీ20 వరల్డ్ కప్కు పాకిస్తాన్ జట్టును ప్రకటించకపోవడంపై ఆగ్రహం..
‘‘ఈ దశలో పిటిషనర్ తీవ్రమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారని, ఆమె బయటకు కూడా రాలేదు, ఆమె నీట్ పరీక్ష కోసం క్లాసెస్కి వెళ్తుందని, ఆమె చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నారు. ఆమె ఈ దశలో సమాజాన్ని ఎదుర్కోలేకపోతోంది’’ అని న్యాయవాది చెప్పారు. ఆమె మానసిక, శారీరక శ్రేయస్సును పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది వాదించారు. ఏప్రిల్ 25న పిండం, పిటిషనర్ పరిస్థితిని నిర్ధారించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ని ఆదేశించామని, మే 3న తన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.
మెడికల్ బోర్డు నివేదిక ప్రకారం.. పిండంలో పట్టుకతో వచ్చే అసహజత ఏం లేదని, గర్భాన్ని కొనసాగించడం వల్ల తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని హైకోర్టు పేర్కొంది. కాబట్టి భ్రూణ హత్య నైతికంగా, చట్టపరంగా అనుమతించబడదు అని చెప్పింది. పిటిషనర్ హైకోర్టు ముందు తన కడుపులో అసౌకర్యంగా అనిపించిందని ఏప్రిల్ 16న పేర్కొంది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయగా, ఆమె 27 వారాల గర్భవతి అని తేలింది. ఇది చట్టబద్ధంగా అనుమతించే 24 వారాల పరిమితిని దాటిపోయింది. MTP చట్టం ప్రకారం, వైద్య బోర్డు ద్వారా పిండం అసాధారణంగా ఉండటం లేదా తల్లికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మాత్రమే 24 వారాల కన్నా ఎక్కువ వ్యవధి గర్భాన్ని రద్దు చేయడానికి అనుమతించబడుతుంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!