AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP Crisis: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో పెను రాజకీయ సంక్షోభం నెలకున్న విషయం తెలిసిందే. పార్టీ కీలక నేతలు, రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం అధికారికంగా బీజేపీలో చేరారు. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్కు ఇది కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. పార్టీని వీడటం కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదని, ఇది పంజాబ్ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమేనని ఆయన మండిపడ్డారు. దీనిని “పంజాబ్ ప్రజలకు చేసిన ద్రోహం”గా ఆయన అభివర్ణించారు.
తప్పు కేజ్రీవాల్దే .. అన్నా హజారే ధ్వజం
ఈ రాజకీయ పరిణామాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందిస్తూ ఆప్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంది. ఆప్ సరైన మార్గంలో నడిచి ఉంటే ఈ నేతలు పార్టీని వీడేవారు కాదు. పార్టీని నడుపుతున్న వారిలోనే తప్పు ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం (అరవింద్ కేజ్రీవాల్) సరైన దిశలో వెళ్లకపోవడం వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన పదేపదే పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాము అనేక సమస్యలను ఎదుర్కొన్నామని, అందుకే తప్పుకుంటున్నామని ప్రకటించారు. ఆప్ రాజ్యసభ ఎంపీలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొనడం సంచలనం రేపింది. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలే బీజేపీలో చేరినప్పటికీ, మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
ఆప్కు పెద్ద దెబ్బ..
2012లో ఏర్పాటైన ఆప్, కేవలం 14 ఏళ్లలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుని జాతీయ పార్టీగా ఎదిగింది. రాజ్యసభలో పార్టీకున్న 10 మంది ఎంపీలలో ఏడుగురు పార్టీని వీడతారనే ప్రచారం ఆప్ను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ పుట్టుకకు స్ఫూర్తినిచ్చిన అన్నా హజారే స్వయంగా కేజ్రీవాల్ నాయకత్వాన్ని తప్పుబట్టడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పంజాబ్లో అధికారంలో ఉన్న పార్టీకి ఈ పరిణామాలు భవిష్యత్తులో పార్టీకి గడ్డుకాలాన్ని సూచిస్తున్నాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!