Security for The Tree: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ చెట్టును కంటికి రెప్పలా కాపాడుతోంది. దీనికి చుట్టూ కంచె, రక్షణగా సాయుధులైన నలుగురు గార్డులు 24 గంటలకు చెట్టుకు చూసుకుంటున్నారు. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏకంగా లక్షల్లో వెచ్చిస్తోంది. ఇప్పటి వరకు నీరు పోసేందుకు రూ.64 లక్షలు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్ రైసెన్ లోని సాంచి స్థూపం సమీపంలో ఈ చెట్టును నాటారు. దీనికి పగలు, రాత్రి సెక్యూరిటీ ఇస్తున్నారు.