NITI Aayog: ప్రధాని మోడీ సమావేశానికి 8 మంది సీఎంలు డుమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NITI Aayog: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి 8 రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. ‘‘విక్షిత్ భారత్ @2047: టీమ్ ఇండియా పాత్ర’ అనే అంశంపై నీతి ఆయోగ్ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వీరంతా రాలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశానికి డుమ్మా కోట్టారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోగ్యకారణాల వల్ల రాలేకపోతున్నట్లు వెల్లడించారు. కేరళ సీఎం పినరయి విజయన్ గైర్హాజరుకు ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ అధికారులు బదిలీలు, నియామకాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్డీయేతర ప్రతిపక్షాలను కలిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వివిధ రాష్ట్రాల్లోని బీజేపేతర నేతలను కలుస్తున్నారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు
ఇక బీజేపీకి వ్యతిరేకంగా కొత్తగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లు ఉన్నారు, తరుచుగా వీరంతా కేంద్రం, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్రం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. అయితే ఎన్డీయే, యూపీఏ కూటములకు సమదూరం పాటిస్తున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాం వల్ల సమావేశానికి హాజరుకావడం లేదని చెప్పారు.
8 మంది సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి ప్రణాళికకు నీతి ఆయోగ్ ముఖ్యమైనదని, హాజరుకాని ముఖ్యమంత్రులు, వారి రాష్ట్ర ప్రజలు గొంతును వినిపించడం లేదని, మోడీకి వ్యతిరేకంగా ఎంత దూరం వెళ్లారు..? అని ప్రశ్నించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నారంటే కేంద్రం వారి పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రాన్ని ఎవరు పట్టించుకోకపోయినా నీతి ఆయోగ్ తమ డిమాండ్లను వినడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..