Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal-Tibet Flash Floods: నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావం కైలాస మానస సరోవర్ యాత్రపై పడింది. జలప్రళయం కారణంగా కీలకమైన రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే యాత్రకు బుక్ చేసుకున్న శివ భక్తుల్లో ఆందోళన నెలకొంది.
రేపటి నుంచి షెడ్యూల్ చేసిన యాత్రలు నిలిపివేత
నేపాల్ మీదుగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు భక్తుల బ్యాచ్లను ఇప్పటికే షెడ్యూల్ చేశారు. ముఖ్యంగా ఖాట్మాండు–రసువగఢీ–కీరుంగ్ మార్గం మీదుగా మానస సరోవరం చేరుకునేందుకు పలువురు యాత్రికులు బుకింగ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పదుల సంఖ్యలో భక్తులు ఈ యాత్రకు బుక్ చేసుకున్నట్లు సమాచారం. అయితే రసువగఢీ ప్రాంతంలో భారీగా వరదలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జలప్రళయం కారణంగా మానస సరోవరానికి వెళ్లే రహదారి మార్గాలు మూసుకుపోయాయి. దీంతో రేపటి నుంచి ఖాట్మాండు నుంచి ప్రారంభం కావాల్సిన యాత్రను నిలిపివేసినట్లు సమాచారం.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
టూరిస్టులు స్వస్థలాలకు వెళ్లాలని సూచన
ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో నేపాల్-టిబెట్ సరిహద్దు అధికారులు పర్యాటకులు, యాత్రికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో రాకపోకలు క్లిష్టంగా మారడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరో నెల రోజుల పాటు మార్గం మూసివేత?
జలప్రళయం కారణంగా మానస సరోవర్ యాత్రకు ఉపయోగించే మార్గాలు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మరో నెల రోజుల పాటు మానస సరోవర్ మార్గం మూసి ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ 23వ తేదీకి యాత్ర బుక్ చేసుకున్న భక్తులకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని అధికారులు, సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
కొత్త బుకింగ్స్పై టూర్ ఆపరేటర్లకు కీలక సూచన
ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా చైనా, నేపాల్, టిబెట్ ప్రాంతాలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కూడా క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా స్పష్టమయ్యే వరకు కొత్త యాత్రికుల జాబితాలను పంపవద్దని టూర్ ఆపరేటర్లకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా, ప్రకృతి వైపరీత్యం కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రహదారులు పునరుద్ధరణ, సరిహద్దు పరిస్థితులు, అనుమతుల ప్రక్రియ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే యాత్రలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న భక్తులు అధికారిక సమాచారం కోసం వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!