NITI Aayog: ప్రధాని మోడీ సమావేశానికి 8 మంది సీఎంలు డుమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NITI Aayog: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి 8 రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. ‘‘విక్షిత్ భారత్ @2047: టీమ్ ఇండియా పాత్ర’ అనే అంశంపై నీతి ఆయోగ్ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వీరంతా రాలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశానికి డుమ్మా కోట్టారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోగ్యకారణాల వల్ల రాలేకపోతున్నట్లు వెల్లడించారు. కేరళ సీఎం పినరయి విజయన్ గైర్హాజరుకు ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ అధికారులు బదిలీలు, నియామకాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్డీయేతర ప్రతిపక్షాలను కలిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా వివిధ రాష్ట్రాల్లోని బీజేపేతర నేతలను కలుస్తున్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
Read Also: Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు
ఇక బీజేపీకి వ్యతిరేకంగా కొత్తగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లు ఉన్నారు, తరుచుగా వీరంతా కేంద్రం, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్రం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. అయితే ఎన్డీయే, యూపీఏ కూటములకు సమదూరం పాటిస్తున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాం వల్ల సమావేశానికి హాజరుకావడం లేదని చెప్పారు.
8 మంది సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి ప్రణాళికకు నీతి ఆయోగ్ ముఖ్యమైనదని, హాజరుకాని ముఖ్యమంత్రులు, వారి రాష్ట్ర ప్రజలు గొంతును వినిపించడం లేదని, మోడీకి వ్యతిరేకంగా ఎంత దూరం వెళ్లారు..? అని ప్రశ్నించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నారంటే కేంద్రం వారి పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రాన్ని ఎవరు పట్టించుకోకపోయినా నీతి ఆయోగ్ తమ డిమాండ్లను వినడం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!