Republic Day: రిపబ్లిక్ వేడుకలకు అంతా సిద్ధం.. ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
74th Republic Day celebrations in Delhi: 74వ గణతంత్ర వేడుకలు దేశం సిద్ధం అయింది. దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిక్ డే ఉత్సవాలకు మస్తాబు అయింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రిపబ్లిక్ డే వేడులకు జరగనున్నాయి. ఈ వేడుకలకు అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్వా అల్ సిసి హాజరవ్వనున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్ వీక్షించేందుకు టికెట్లు ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచిన ప్రభుత్వం. సీటింగ్ సామర్థ్యాన్ని 1.2 లక్షల నుంచి 45 వేలకు తగ్గించారు.
Read Also: Donald Trump: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ.. నిషేధం ఎత్తివేత
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
రిపబ్లిక్ డే పెరేడ్ లో భాగంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసి ఆయుధాలను ఆర్మీ ప్రదర్శించనుంది. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు పరేడ్ సాగనుంది. గణతంత్ర వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఒక్కో బృందం కవాతు నిర్వహించనుంది. జాతీయగీతం ఆలాపన సందర్భంగా 21 గన్ సెల్యూట్స్ కోసం సాంప్రదాయంగా ఉపయోగించే పురాత బ్రిటీస్ పౌండర్ గన్స్ కు బదులుగా 105ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ ను ఉపయోగించనున్నారు. ఈజిప్టు నుంచి వచ్చిన 120 మంది సైనికులతో కూడిన పటాలం కవాతు నిర్వహించనుంది. కొత్తగా ఆర్మీలో చేరిన అగ్నివీర్ లతో కూడిన పటాలం కవాతు చేయనుంది. ఆర్మీ సిగ్నల్ కోర్, ఎయిర్ డిఫెన్స్ , ఆర్మీ డేర్ డెవిల్స్ విభాగాల నుండి మహిళా అధికారుల మార్చ్ చేయనున్నారు.
ఆకాష్ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్ చేతన్ శర్మ నేతృత్వ వహించనున్నారు. బీఎస్ఎఫ్ కేమెట్ కంటింజెంట్ లోని మహిళల టీమ్ పెరెడ్ లో భాగం కానుంది. నారీశక్తి ప్రదర్శనలో భాగంగా నేవీలోని 144 సెయిలర్ విభాగానికి మహిళా అధికారిణులు నేతృత్వం వహిస్తారు. రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్ లో మొత్తం 44 త్రివిధ దళాల విమానాల విన్యాసాలు, 9 రఫేల్ యుద్ధ విమానాలతో పాటు , దేశీయంగా తయారయిన తేలికపాటి అటాక్ హెలీకాప్టర్లలతో విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ గణతంత్ర వేడుకల్లో జనభాగదారి(ప్రజల భాగస్వామ్యం) స్ఫూర్తితో జరుగుతాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విన్యాసాలు, వారి కుటుంబ సభ్యులు, కర్తవ్య మార్గంలోని నిర్వహణ కార్మికులు, కూరగాయాల విక్రేతలు, కిరాణా దుకాణదారులు, రిక్షా పుల్లర్స్ పాల్గొనడం విశేషం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!