African Swine Flu: మధ్యప్రదేశ్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. పందుల చంపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
700 Pigs Culled In Madhya Pradesh Amid African Swine Flu Scare: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ భయాందోళనలను రేపుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. దమోహ్ జిల్లాలో ఈ వ్యాధి వెలుగులోకి రావడంతో అధికారులు పందులను చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 700 పందులను చంపినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గత పదిహేను రోజులుగా వరసగా జంతువులు చనిపోతున్నాయి. జిల్లాలోని హటా బ్లాక్ ఓ జంతువు హఠాత్తుగా మరణించింది. ఆ తరువాత వరసగా జిల్లాలోని బనావర్ ప్రాంతంలో ఆవులు, ఎద్దులు, పందులలతో సహా వందలాది జంతువులు వారం రోజుల వ్యవధిలో చనిపోయాయి.
Read Also: Air India: మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు..
Also Read
- Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
ఈ ఘటనపై విచారించిన వెటర్నరీ డాక్టర్లు.. జంతువులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్థారించారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సోమిల్ రాయ్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం సూచన మేరకు అనారోగ్యంతో ఉన్న పందుల నమూనాలను సేకరించి విశ్లేషించామని జిల్లాలోని హటా, బనావర్ ప్రాంతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించామని, ఫలితంగా ఆ ప్రాంతంలో వ్యాధి వ్యాపించిందని.. దీంతో పందునలు చంపుతున్నట్లు వెల్లడించారు. పందులను చంపేసి జేసీబీల సాయంతో పూడ్చివేస్తున్నారు. గత రెండు రోజుల్లో 700 కన్నా ఎక్కువ పందును చంపి పాతిపెట్టారు. దమోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి సోకిన ప్రాంతాల్లో పందులను చంపేస్తున్నామని.. ఎవరైనా పందుల కాపరిలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Anil Ravipudi: త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!