Road Accident: బైసాఖీ వేడుకల వెళ్తున్న క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Road Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైసాఖీ వేడుకలకు వెళ్తున్న యాత్రికులకు విషాదాన్ని మిగిల్చింది. హోషియార్ పూర్ జిల్లాలోని ఖురల్ ఘర్ సాహిబ్ లో బైసాఖీ వేడుకలను జరుపుకోవడానికి వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా.. మరో 10 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా నివాసితులేనని గర్హశంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) దల్జీత్ సింగ్ ఖాఖ్ తెలిపారు.
Read Also: Asaduddin Owaisi: బీజేపీ వారిని కూడా ఇలాగే చంపేస్తుందా.? యూపీ ఎన్కౌంటర్పై ఓవైసీ
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ప్రమాద జరిగిన ప్రాంతం వాలుగా ఉందని, డ్రైవర్ నడిపేటప్పుడు నియంత్రణ కోల్పోయి కాలినడకన వెళ్తున్న 17 మంది యాత్రికులను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేకులు ఫెయిలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను రాహుల్, సుదేష్ పాల్, సంతోష్, అంగూరి, కుంతి, గీత, రామోహ్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురిని చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్కు రిఫర్ చేయగా, మిగిలిన వారిని గర్శంకర్లోని సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఖురల్ ఘర్ సాహిబ్ కు బైశాఖీ పండగ సందర్భంగా పెద్ద ఎత్తున యాత్రీకులు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!