Delhi Shocking: ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం.. గుంతలో పడి యువకుడి మృతి
- దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం
- ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం
- గుంతలో పడి యువకుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. నడిరోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు తవ్విన గుంత కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన జనక్పురిలో జరిగింది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: Mayawati: ‘ఘుష్ఖోర్ పండిట్’ సినిమా నిలిపేయండి.. కేంద్రానికి మాయావతి విజ్ఞప్తి
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
జనక్పురిలో ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా నిర్లక్ష్యంగా అలా వదిలేశారు. దీంతో ఓ యువకుడు బైక్పై వేగంగా వస్తూ గుంతలో పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే కుమారుడి జాడ తెలియక తల్లిదండ్రులు రాత్రంతా వెతికారు. పోలీసులను ఆశ్రయించారు. అయినా కూడా సమాచారం దొరకలేదు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చీకటిగా ఉండడంతో ప్రజలెవరూ గమనించలేదు. శుక్రవారం ఉదయం 7 గంటలకు వెలుగు రావడంతో గుంతలో యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులు.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తమ కుమారుడేనని గుర్తించారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: RBI Policy: ఆర్బీఐ పాలసీ వచ్చేసింది.. ఈఎంఐ దారులకు నిరాశ
ప్రమాద స్థలంలో ఢిల్లీ జల్ బోర్డు పనులు జరుగుతున్నాయని.. రోడ్డుపై లోతైన గోతి తవ్వారని స్థానికులు చెప్పారు. ఎటువంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయలేదన్నారు. రాత్రిపూట చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ధ్వజమెత్తారు. ‘‘ఒక అమాయక బైకర్ లోతైన గుంతలో పడి రాత్రంతా అక్కడే ఉండి చనిపోయాడని.. నోయిడా సంఘటన నుంచి బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదు. వారు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతారు.’’ అని పేర్కొన్నారు.
మంత్రి ఆశిష్ సూద్ దర్యాప్తు
ప్రమాద ఘటనపై మంత్రి ఆశిష్ సూద్ నియోజకవర్గంలోనే ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే దర్యాప్తునకు మంత్రి ఆదేశించారు. ఢిల్లీ జల్ బోర్డు ఓపెన్ చేసి పెట్టిందా? మరేదైనా ఏజెన్సీ పనిచేస్తుందా? ప్రమాదం జరిగిన సమయంలో భద్రతా ప్రమాణాలను ఎందుకు పాటించలేదు?.’’ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Shocking !!!
सड़क में गहरे गड्ढे में एक मासूम बाइक सवार गिर कर फँस गया, रात भर पड़ा रहा और मर गया
नोएडा की घटना से दिल्ली की भाजपा सरकार ने कुछ नहीं सीखा। बस रोज़ झूठ बोला जाता है।
जनकपुरी डिस्ट्रिक्ट सेंटर, दिल्ली pic.twitter.com/4WJr1tLdiI
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 6, 2026
#WATCH | Janakpuri, Delhi | A biker dies allegedly due to falling into a pit. Further details awaited. pic.twitter.com/7kja0wll1M
— ANI (@ANI) February 6, 2026
తాజావార్తలు
-
SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
-
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!