Delhi Shocking: ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం.. గుంతలో పడి యువకుడి మృతి
- దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం
- ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం
- గుంతలో పడి యువకుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. నడిరోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు తవ్విన గుంత కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన జనక్పురిలో జరిగింది. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: Mayawati: ‘ఘుష్ఖోర్ పండిట్’ సినిమా నిలిపేయండి.. కేంద్రానికి మాయావతి విజ్ఞప్తి
Also Read
- Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
జనక్పురిలో ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా నిర్లక్ష్యంగా అలా వదిలేశారు. దీంతో ఓ యువకుడు బైక్పై వేగంగా వస్తూ గుంతలో పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే కుమారుడి జాడ తెలియక తల్లిదండ్రులు రాత్రంతా వెతికారు. పోలీసులను ఆశ్రయించారు. అయినా కూడా సమాచారం దొరకలేదు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చీకటిగా ఉండడంతో ప్రజలెవరూ గమనించలేదు. శుక్రవారం ఉదయం 7 గంటలకు వెలుగు రావడంతో గుంతలో యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులు.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తమ కుమారుడేనని గుర్తించారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: RBI Policy: ఆర్బీఐ పాలసీ వచ్చేసింది.. ఈఎంఐ దారులకు నిరాశ
ప్రమాద స్థలంలో ఢిల్లీ జల్ బోర్డు పనులు జరుగుతున్నాయని.. రోడ్డుపై లోతైన గోతి తవ్వారని స్థానికులు చెప్పారు. ఎటువంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయలేదన్నారు. రాత్రిపూట చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ధ్వజమెత్తారు. ‘‘ఒక అమాయక బైకర్ లోతైన గుంతలో పడి రాత్రంతా అక్కడే ఉండి చనిపోయాడని.. నోయిడా సంఘటన నుంచి బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదు. వారు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతారు.’’ అని పేర్కొన్నారు.
మంత్రి ఆశిష్ సూద్ దర్యాప్తు
ప్రమాద ఘటనపై మంత్రి ఆశిష్ సూద్ నియోజకవర్గంలోనే ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే దర్యాప్తునకు మంత్రి ఆదేశించారు. ఢిల్లీ జల్ బోర్డు ఓపెన్ చేసి పెట్టిందా? మరేదైనా ఏజెన్సీ పనిచేస్తుందా? ప్రమాదం జరిగిన సమయంలో భద్రతా ప్రమాణాలను ఎందుకు పాటించలేదు?.’’ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Shocking !!!
सड़क में गहरे गड्ढे में एक मासूम बाइक सवार गिर कर फँस गया, रात भर पड़ा रहा और मर गया
नोएडा की घटना से दिल्ली की भाजपा सरकार ने कुछ नहीं सीखा। बस रोज़ झूठ बोला जाता है।
जनकपुरी डिस्ट्रिक्ट सेंटर, दिल्ली pic.twitter.com/4WJr1tLdiI
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 6, 2026
#WATCH | Janakpuri, Delhi | A biker dies allegedly due to falling into a pit. Further details awaited. pic.twitter.com/7kja0wll1M
— ANI (@ANI) February 6, 2026
తాజావార్తలు
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!