Waqf Board : మా ఆస్తులను వక్ఫ్ బోర్డు లాగేసుకుంది.. జేపీసీకి 600 క్రైస్తవ కుటుంబాలు ఫిర్యాదు..!
- వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీకి ఫిర్యాదు చేసిన 600 మంది క్రైస్తవ కుటుంబాలు..
- తమ భూములను లాగేసుకుంటున్నారని ఆరోపించిన క్రైస్తవ కుటుంబాలు..
- న్యాయం చేయాలని పార్లమెంట్ కమిటీకి లేఖ రాసిన కేరళలోని క్యాథలిక్ బిషప్ కౌన్సిల్..
Waqf Board : వక్ఫ్ సవరణ బిల్లు-2024పై కేరళలోని కొచ్చి నగర శివార్లలోని చేరై గ్రామానికి చెందిన దాదాపు 610 మంది క్రైస్తవ కుటుంబాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటోందని ఆ కుటుంబాలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రైస్తవ కుటుంబాల వాణిని వినిపిస్తూ కేరళలోని సైరో మలబార్ చర్చ్, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్లు పూర్తి వివరాలతో కూడిన లేఖను జేపీసీకి పంపాయి. వాటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
Read Also: Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..
Also Read
కాగా, వక్ఫ్ భూముల అంశం దేశంలోని అన్ని వర్గాల ప్రజలనూ చాలా ప్రభావితం చేస్తోంది అనేందుకు ఈ లేఖలే నిదర్శనమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ అంశంపై క్రైస్తవ వర్గం తీవ్ర అభ్యంతరాలను కూడా జేపీసీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునాంబం గ్రామం పరిధిలోని క్రైస్తవుల ఆస్తులనూ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేస్తోందని జేపీసీకి క్రైస్తవ మత పెద్దలు పంపిన ఓ లేఖలో తెలిపారు. చేరై, మునాంబం గ్రామాల్లో అత్యధిక సంఖ్యల్లో క్రైస్తవులు, మత్స్యకారులేనని, వాళ్లు దశాబ్దాలుగా ఆయా గ్రామాల్లోనే నివసిస్తున్నారని వెల్లడించారు.

తాజావార్తలు
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో