Waqf Board : మా ఆస్తులను వక్ఫ్ బోర్డు లాగేసుకుంది.. జేపీసీకి 600 క్రైస్తవ కుటుంబాలు ఫిర్యాదు..!
- వక్ఫ్ సవరణ బిల్లు-2024పై జేపీసీకి ఫిర్యాదు చేసిన 600 మంది క్రైస్తవ కుటుంబాలు..
- తమ భూములను లాగేసుకుంటున్నారని ఆరోపించిన క్రైస్తవ కుటుంబాలు..
- న్యాయం చేయాలని పార్లమెంట్ కమిటీకి లేఖ రాసిన కేరళలోని క్యాథలిక్ బిషప్ కౌన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Board : వక్ఫ్ సవరణ బిల్లు-2024పై కేరళలోని కొచ్చి నగర శివార్లలోని చేరై గ్రామానికి చెందిన దాదాపు 610 మంది క్రైస్తవ కుటుంబాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటోందని ఆ కుటుంబాలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రైస్తవ కుటుంబాల వాణిని వినిపిస్తూ కేరళలోని సైరో మలబార్ చర్చ్, కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్లు పూర్తి వివరాలతో కూడిన లేఖను జేపీసీకి పంపాయి. వాటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
Read Also: Israel- Iran: ఇజ్రాయెల్పై అణు దాడి చేయాలని ఇరాన్ ప్రజలు డిమాండ్..
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
కాగా, వక్ఫ్ భూముల అంశం దేశంలోని అన్ని వర్గాల ప్రజలనూ చాలా ప్రభావితం చేస్తోంది అనేందుకు ఈ లేఖలే నిదర్శనమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ అంశంపై క్రైస్తవ వర్గం తీవ్ర అభ్యంతరాలను కూడా జేపీసీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునాంబం గ్రామం పరిధిలోని క్రైస్తవుల ఆస్తులనూ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేస్తోందని జేపీసీకి క్రైస్తవ మత పెద్దలు పంపిన ఓ లేఖలో తెలిపారు. చేరై, మునాంబం గ్రామాల్లో అత్యధిక సంఖ్యల్లో క్రైస్తవులు, మత్స్యకారులేనని, వాళ్లు దశాబ్దాలుగా ఆయా గ్రామాల్లోనే నివసిస్తున్నారని వెల్లడించారు.

తాజావార్తలు
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!