Food poisoning: ఫుడ్ పాయిజనింగ్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత..
Food poisoning: ఇటీవల కాలం పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పంజాబ్లో మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. సంగ్రూర్లోని ఓ ప్రభుత్వ స్కూల్ క్యాంటీన్లో ఆహారం తిని 60 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు శనివారం తెలిపారు. కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఫుడ్ కాంట్రాక్టర్ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు ఘాతుకం.. మందుపాతర పేలుడు, ఇద్దరు జవాన్లకు గాయాలు
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
క్యాంటీన్లోని ఆహారం తిన్న తర్వాత శుక్రవారం సాయంత్రం గబ్దాన్లోని ప్రభుత్వ మెరిటోరియస్ పాఠశాలలోని 20 మంది చిన్నారులు తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. వీరిని వెంటనే సంగ్రూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 15 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. శనివారం రోజు మరికొంత మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 50 మంది చిన్నారులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నారని, దీంతోనే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఆహార నమూనాలను పరీక్ష కోసం తరలించారు. ఈ ఘటనకు ముందు దీపావళి రోజున హాస్టల్లో వడ్డించే ఆహారంలో పురుగులు వచ్చాయని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో