Lumpy Disease: లంపి వ్యాధితో ఇప్పటివరకు 57వేల పశువులు మృతి.. వ్యాక్సినేషన్ పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
Lumpy Disease: గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ లంపి చర్మ వ్యాధి కారణంగా ఇప్పటివరకు సుమారు 57,000 పశువులు చనిపోయాయని, వ్యాధిని నియంత్రించడానికి టీకా ప్రక్రియను పెంచాలని బాధిత రాష్ట్రాలను కేంద్రం గురువారం కోరింది.
లంపి చర్మ వ్యాధి(LSD) అనేది ఒక వైరల్ వ్యాధి, ఇది పశువులను ప్రభావితం చేస్తుంది. జ్వరం, చర్మంపై నోడ్యూల్స్తో పాటు మరణానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగలు, పశువుల మధ్య ప్రత్యక్ష సంబంధం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. ప్రధాన లక్షణాలు జంతువులలో జ్వరం, కళ్ళు మరియు ముక్కు నుండి స్రావాలు, నోటి నుండి లాలాజలం, శరీరమంతా నోడ్యూల్స్ వంటి మృదువైన పొక్కులు, పాల ఉత్పత్తి తగ్గడం, తినడానికి ఇబ్బంది, ఇది కొన్నిసార్లు జంతువు మరణానికి దారితీస్తుంది. “గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్తో సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్లో, కొన్ని కేసులు నమోదయ్యాయి” అని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా విలేకరులతో అన్నారు. సెప్టెంబర్ 12-15 మధ్య భారతదేశంలో నిర్వహించబడుతున్న ఐడీఎఫ్ వరల్డ్ డే సమ్మిట్ను ప్రకటించే సందర్భంగా ఈ వ్యాధి గురించి మాట్లాడారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
పరిస్థితిని అంచనా వేయడానికి, నియంత్రణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి తాను ఐదు రాష్ట్రాలను సందర్శించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. లంపి వ్యాధికి వ్యతిరేకంగా ‘గోట్ పాక్స్ వ్యాక్సిన్’ ప్రభావవంతంగా పని చేస్తోందన్నారు. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. గుజరాత్లో పరిస్థితి మెరుగుపడిందని, పంజాబ్, హర్యానాలో వ్యాధి అదుపులో ఉందని రూపాలా చెప్పారు. రాజస్థాన్లో ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు పాల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడలేదని మంత్రి తెలిపారు.
CDS General Bipin Rawat: ఆర్మీ స్థావరానికి దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పేరు
వ్యాక్సినేషన్లో పెరుగుదల, వ్యాధిని నియంత్రించడానికి ప్రోటోకాల్ను అనుసరించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడించారు. చనిపోయిన పశువులను ఖననం చేసే ప్రొటోకాల్ను పాటించాలని మంత్రి రాష్ట్రాలకు సూచించారు.పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి జతీంద్ర నాథ్ స్వైన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 57,000 పశువులు చనిపోయాయని, వాటిలో 37,000 రాజస్థాన్లో ఉన్నాయని చెప్పారు. రాజస్థాన్పై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సలహాలు పంపుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!