Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Blasts Ap Government This Govt Has A Magic Disease They Removed Aarogyasri

YS Jagan: ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది.. ఆరోగ్యశ్రీని ఎత్తేశారు!

Published Date :December 4, 2025 , 1:32 pm
By Sampath Kumar
  • కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడం లేదు
  • విద్యా దీవెన, వసతి దీవెన కలపి రూ.7 వేల కోట్ల వరకు బకాయి
  • కలుషిత ఆహారం, తాగునీటి వల్ల 29 మంది విద్యార్ధులు చనిపోయారు
  • నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి
YS Jagan: ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది.. ఆరోగ్యశ్రీని ఎత్తేశారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడం లేదని, విద్యార్ధులు చదువులు మానేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి దీవెన కూడా ఇవ్వట్లేదని, రూ.2200 కోట్లు బకాయి పెట్టారన్నారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేస్తున్నారని, ప్రతీ పిల్లాడు సొంతగా కారియర్స్ తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని, అందుకే ఆరోగ్యశ్రీని ఎత్తేశారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో అన్నీ స్కాములే అని.. బాధ్యతల నుంచి తప్పించుకోవటం, స్కాములు చేయటం అని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒక స్కాం అయితే.. తీసుకున్న వాళ్లకు ఒక బొనాంజా ఇచ్చారని జగన్ చెప్పుకొచ్చారు.

ఈరోజు వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘విద్యార్ధులు చదువులు మానేస్తున్నారు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు 8 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఆగిపోయాయి. మొత్తం దాదాపు రూ.5600 కోట్ల వరకు ఆగిపోయాయి. ఇప్పటివరకు ఇచ్చింది రూ.700 కోట్లు.. దాదాపు రూ.4800 కోట్లు బకాయిలు ఉన్నాయి. వసతి దీవెన కూడా ఇవ్వట్లేదు.. రూ.2200 కోట్లు బకాయి పెట్టారు. విద్యా దీవెన, వసతి దీవెన కలపి రూ.7 వేల కోట్ల వరకు బకాయి ఉన్నాయి. పిల్లల జీవితాలను సీఎం చంద్రబాబు చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతీ పిల్లాడు సొంతగా కారియర్స్ తీసుకువెళ్తున్నారు. తినే ఆహారం అసలు రుచిగా ఉండటం లేదు. ఈ 18 నెలల్లో ప్రభుత్వ హాస్టల్స్ లో కలుషిత ఆహారం, తాగునీటి వల్ల 29 మంది విద్యార్ధులు చనిపోయారు. 29 మంది విద్యార్ధులు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చనిపోయారు. వందల మంది విద్యార్ధులు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్రంలో చదువులు, విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉంది అనేదానికి అనేక ఉదాహరణలు. ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది.. ఆరోగ్యశ్రీని ఎత్తేశారు. ఈ ప్రభుత్వంలో అన్నీ స్కాములే. బాధ్యతల నుంచి తప్పించుకోవటం.. స్కాములు చేయటం అలవాటుగా మారింది. బకాయిలు చెల్లించకపోవటంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు అనేకసార్లు ప్రశ్నించటంతో రూ.1800 కోట్లు ఇచ్చారు. రూ.3600 కోట్లు బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల వాళ్ళు సమ్మెకు దిగారు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడికి 108, 104 అప్పగించారు. కనీసం రూ.500 కోట్లు నెట్వర్ట్ కూడా లేని సంస్థకు ఇచ్చారు’ అని జగన్ మండిపడ్డారు.

‘మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒక స్కాం అయితే, తీసుకున్న వాళ్లకు ఒక బొనాంజా ఇచ్చారు. కళాశాలలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు మాత్రం ప్రభుత్వం ఇస్తుందట. ప్రభుత్వ భూమి, బిల్డింగులు, స్టాఫ్, జీతాలు.. కానీ ఓనర్లు మాత్రం ప్రైవేట్ వాళ్ళు. లాభాలు ప్రైవేట్ వాళ్లకు.. భారాలు ప్రభుత్వానికి. ఒకవైపు ప్రజా ఉద్యమం జరుగుతున్నా ఖాతరు చేయకుండా జీవో ఇస్తున్నారు. స్కాముల్లో కూడా ఇక అడుగు ముందుకు వేసి చేస్తున్నాడు. ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోవటంతో ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. మా పార్టీ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 10న అందరికి చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతాం. 13న అన్నీ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు చేరతాయి. ఈనెల 16న గవర్నర్ కు చెప్పటం.. చూపించటం అయిన తర్వాత హైకోర్టులు పిటిషన్ కూడా వేస్తాం’ అని వైఎస్ జగన్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Aarogyasri
  • AP fee reimbursement
  • AP students crisis
  • cm chandrababu
  • ycp

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions