Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్థినుల లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్కి లేఖ రాశారు. ప్రొఫెసర్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
లేఖ కాపీలను వైస్ ఛాన్సరల్ డాక్టర్ అజ్మీర్ సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రేఖా శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, మీడియా సంస్థలకు పంపారు. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలపై ఆరోపించారు. ‘‘ప్రొఫెసర్ అమ్మాయిలను తన కార్యాలయాలకు పిలిచి, వారిని బాత్రూమ్లోకి తీసుకెళ్తాడు, ప్రైవేట్ భాగాలను తాకుతాడు. మాతో అసభ్యకరమైన పనులు చేస్తారు. తాము నిరసన తెలిపితే, పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడు’’ అని అమ్మాయిలు లేఖలో పేర్కొన్నారు. ఇది గత కొన్ని నెలలుగా జరుగుతోందని వారు ఆరోపించారు.
Also Read
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
వైస్ ఛాన్సలర్ కూడా తమకు మద్దతు నిలవకుండా, తమను బహిష్కరిస్తామని బెదిరించాడని, నిందితుడైన ప్రొఫెసర్కి రాజకీయ పలుకుబడి ఉందని వైస్ ఛాన్సలర్ పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నరని, యూనివర్సిటీ కమిటీ కూడా ఈ ఆరోపణలను విచారిస్తుందని, ఇవి తీవ్రమైన ఆరోపణలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అన్నారు. దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని, వారు తప్పించుకోలేరని రిజిస్టార్ చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు సిర్సా పోలీస్ అధికారి దీప్తి గార్గ్ వెల్లడించారు. ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న సీఎం కట్టర్, అతని సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. గతంలో హర్యానా జింద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ లేఖ వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!