Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్థినుల లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్కి లేఖ రాశారు. ప్రొఫెసర్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
లేఖ కాపీలను వైస్ ఛాన్సరల్ డాక్టర్ అజ్మీర్ సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రేఖా శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, మీడియా సంస్థలకు పంపారు. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలపై ఆరోపించారు. ‘‘ప్రొఫెసర్ అమ్మాయిలను తన కార్యాలయాలకు పిలిచి, వారిని బాత్రూమ్లోకి తీసుకెళ్తాడు, ప్రైవేట్ భాగాలను తాకుతాడు. మాతో అసభ్యకరమైన పనులు చేస్తారు. తాము నిరసన తెలిపితే, పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడు’’ అని అమ్మాయిలు లేఖలో పేర్కొన్నారు. ఇది గత కొన్ని నెలలుగా జరుగుతోందని వారు ఆరోపించారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
వైస్ ఛాన్సలర్ కూడా తమకు మద్దతు నిలవకుండా, తమను బహిష్కరిస్తామని బెదిరించాడని, నిందితుడైన ప్రొఫెసర్కి రాజకీయ పలుకుబడి ఉందని వైస్ ఛాన్సలర్ పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నరని, యూనివర్సిటీ కమిటీ కూడా ఈ ఆరోపణలను విచారిస్తుందని, ఇవి తీవ్రమైన ఆరోపణలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అన్నారు. దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని, వారు తప్పించుకోలేరని రిజిస్టార్ చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు సిర్సా పోలీస్ అధికారి దీప్తి గార్గ్ వెల్లడించారు. ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న సీఎం కట్టర్, అతని సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. గతంలో హర్యానా జింద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ లేఖ వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!