Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్థినుల లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్కి లేఖ రాశారు. ప్రొఫెసర్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
లేఖ కాపీలను వైస్ ఛాన్సరల్ డాక్టర్ అజ్మీర్ సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హర్యానా హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రేఖా శర్మతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, మీడియా సంస్థలకు పంపారు. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలపై ఆరోపించారు. ‘‘ప్రొఫెసర్ అమ్మాయిలను తన కార్యాలయాలకు పిలిచి, వారిని బాత్రూమ్లోకి తీసుకెళ్తాడు, ప్రైవేట్ భాగాలను తాకుతాడు. మాతో అసభ్యకరమైన పనులు చేస్తారు. తాము నిరసన తెలిపితే, పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడు’’ అని అమ్మాయిలు లేఖలో పేర్కొన్నారు. ఇది గత కొన్ని నెలలుగా జరుగుతోందని వారు ఆరోపించారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
వైస్ ఛాన్సలర్ కూడా తమకు మద్దతు నిలవకుండా, తమను బహిష్కరిస్తామని బెదిరించాడని, నిందితుడైన ప్రొఫెసర్కి రాజకీయ పలుకుబడి ఉందని వైస్ ఛాన్సలర్ పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నరని, యూనివర్సిటీ కమిటీ కూడా ఈ ఆరోపణలను విచారిస్తుందని, ఇవి తీవ్రమైన ఆరోపణలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అన్నారు. దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని, వారు తప్పించుకోలేరని రిజిస్టార్ చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు సిర్సా పోలీస్ అధికారి దీప్తి గార్గ్ వెల్లడించారు. ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న సీఎం కట్టర్, అతని సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. గతంలో హర్యానా జింద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ లేఖ వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!