Tamil Nadu: సముద్రంలో మునిగిపోయిన ఐదుగురు యువ డాక్టర్లు.. మృతుల్లో తెలుగు వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కన్యాకుమారి తీరంలో సోమవారం ఇద్దరు మహిళతో సహా ఐదుగురు వైద్యవిద్యార్థులు సముద్రంలో మునిగి చనిపోయారు. విద్యార్థులు తమ వైద్య విద్యను మరికొన్ని రోజుల్లో ముగించనున్నారు. వీరంతా ఎంజాయ్ చేసేందుకు ప్రైవేట్ బీచ్కి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మృతులు ఒక కొబ్బరి తోట నుంచి మూసి ఉన్న లైమూర్ బీచ్కి వెళ్లారని, ఆ ప్రాంతంలో సముద్ర అలలు భయంకరంగా ఉంటాయని, ఈత కొట్టే సమయంలో వీరంతా నీటిలో మునిగిపోయినట్లు కన్యాకుమారి జిల్లా ఎస్పీ ఈ. సుందరవతనం చెప్పారు.
Read Also: PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
మొత్తం 12 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులు కన్యాకుమారి జిల్లాకు చెందిన డాక్టర్ ముత్తుకుమార్ సోదరుడి వివాహాం కోసం ఆదివారం నాగర్ కోయిల్ వచ్చారు. ఈ రోజు ఉదయం కన్యాకుమారిలోని గణపతిపురం సమీపంలోని లైమూర్ బీచ్కి స్నానం చేసేందుకు వెళ్లగా భారీ కెరటం 9 మందిని సముద్రంలోకి లాగేసింది. ఆ సమయంలో మత్స్యకారులు నలుగురిని కాపాడారు. ఈ ఘటనలో తంజావూరుకు చెందిన సారుకవి (24), నైవేలికి చెందిన గాయత్రి (25), ఆంధ్రప్రదేశ్కి చెందిన వెంకటేష్ (24), దిండిగల్కు చెందిన ప్రవీణ్ (23), కుమారికి చెందిన సర్వదర్శిత్ (23) అనే ఐదుగురు వ్యక్తులు మరణించారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉంచారు. మరో ముగ్గురు మహిళా ఇంటర్న్లు కరూర్కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి ప్రియాంక మరియు మదురైకి చెందిన శరణ్యలను రక్షించి ఆసారిపల్లం మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!