PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని వ్రాసిన ఈ గడ్డపై నుంచే కొత్త చరిత్ర మొదలు కాబోతోందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అభివృద్ధిని పరుగులు పెట్టించారని చెప్పారు.
Also Read
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందన్నారు. ఇండియా కూటమి తరచూ ఈడీని ఎందుకు తిడుతుందో ఈరోజు దేశ ప్రజలకు తెలిసిందని చెప్పారు. జార్ఖండ్లో డబ్బు కొండలను ఈడీ తవ్వి తీసిందని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ నేతలకు ఇదేమీ కొత్త కాదన్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో గతంలోనూ డబ్బులు దొరికాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే నల్లధనం ఎందుకు దొరుకుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. ఈ నల్లధనాన్ని బయట పెడుతున్నందుకే తనపై ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినా తాను భయపడనని.. నల్లధనాన్ని పూర్తిగా వెలికితీస్తానని చెప్పుకొచ్చారు. మే 13న ఎన్డీఏ కూటిమికి ఓటు వేసి గెలిపిస్తే.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడతామని మోడీ అన్నారు.
ఏపీలో ఈనెల 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
#WATCH | Andhra Pradesh: During a public rally in East Godavari, Prime Minister Narendra Modi says, "Congress and INDI alliance, keep shouting 'ED' everyday, whole nation has seen its reason today on Television. In Jharkhand, ED recovered a mountain of notes, from the servant of… pic.twitter.com/mEv1pHYxjw
— ANI (@ANI) May 6, 2024
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!