Russia: రష్యన్ ఆర్మీలో చేరిన 45 మంది భారతీయులకు విముక్తి.. మరో 50 మందిని రక్షించే ప్రయత్నం..
- రష్యా ఆర్మీలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి..
- ఉక్రెయిన్ యుద్ధంలో చేరేలా మోసం చేసిన ఏజెంట్లు..
- ప్రధాని మోడీ-పుతిన్ భేటీలో విషయంపై ప్రస్తావన..
- భారతీయుల్ని డిశ్చార్జ్ చేస్తానమి పుతిన్ హామీ..
- 45 మందికి విముక్తి.. మరో 50 మందిని రక్షించే యత్నం..
Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కొన్ని రోజుల క్రితం రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్తో భేటీ అయినప్పుడు భారతీయులు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నట్లు వివరించారు. ఈ భేటీలో భారతీయులను రష్యా విడుదల చేస్తుందని మోడీకి హామీ ఇచ్చారు.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
Read Also: Kolkata: 2 గంటలు సీఎం మమత నిరీక్షణ.. చర్చలకు రాని డాక్టర్లు.. రాజీనామాకు రెడీ అంటూ ప్రకటన!
న్యూ ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న మానవ అక్రమ రవాణా నెట్వర్క్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ద్వారా స్థానిక ఏజెంట్లను ఉపయోగించి రష్యాకు ప్రజలను ఆకర్షించి, ఆ దేశంలో లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించి, వారిని రష్యన్ ఆర్మీలో చేరేలా బలవంతం చేశారు. వారు అక్కడికి వెళ్లిన తర్వాత వారి పాస్పోర్టుని తీసుకుని, యుద్ధంలో చేరేలా, వారికి పోరాటంలో శిక్షణ ఇచ్చారు. దాదాపుగా వంద మంది భారతీయులు ఈ స్థితిలో అక్కడే చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం నలుగురు భారతీయులు మరణించారు.
ఇదిలా ఉంటే ఈ జాబ్ రాకెట్లో యువకుల్ని మోసగించిన నలుగురిని భారత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాకు చెందిన కొందరు ఆర్మీ యూనిఫాం ధరించి, ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నామని తమని రక్షించాలని కోరుతున్న వీడియో వైరల్గా మారింది. దీంతో ఇలా చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్ సిద్ధమైంది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో కేరళ విద్యార్థులను మోసగించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధంలో తప్పుదోవ పట్టించిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి రష్యా చేయగలిగినదంతా చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
-
KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!