Russia: రష్యన్ ఆర్మీలో చేరిన 45 మంది భారతీయులకు విముక్తి.. మరో 50 మందిని రక్షించే ప్రయత్నం..
- రష్యా ఆర్మీలో చిక్కుకున్న భారతీయులకు విముక్తి..
- ఉక్రెయిన్ యుద్ధంలో చేరేలా మోసం చేసిన ఏజెంట్లు..
- ప్రధాని మోడీ-పుతిన్ భేటీలో విషయంపై ప్రస్తావన..
- భారతీయుల్ని డిశ్చార్జ్ చేస్తానమి పుతిన్ హామీ..
- 45 మందికి విముక్తి.. మరో 50 మందిని రక్షించే యత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కొన్ని రోజుల క్రితం రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్తో భేటీ అయినప్పుడు భారతీయులు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నట్లు వివరించారు. ఈ భేటీలో భారతీయులను రష్యా విడుదల చేస్తుందని మోడీకి హామీ ఇచ్చారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
Read Also: Kolkata: 2 గంటలు సీఎం మమత నిరీక్షణ.. చర్చలకు రాని డాక్టర్లు.. రాజీనామాకు రెడీ అంటూ ప్రకటన!
న్యూ ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న మానవ అక్రమ రవాణా నెట్వర్క్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ద్వారా స్థానిక ఏజెంట్లను ఉపయోగించి రష్యాకు ప్రజలను ఆకర్షించి, ఆ దేశంలో లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించి, వారిని రష్యన్ ఆర్మీలో చేరేలా బలవంతం చేశారు. వారు అక్కడికి వెళ్లిన తర్వాత వారి పాస్పోర్టుని తీసుకుని, యుద్ధంలో చేరేలా, వారికి పోరాటంలో శిక్షణ ఇచ్చారు. దాదాపుగా వంద మంది భారతీయులు ఈ స్థితిలో అక్కడే చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం నలుగురు భారతీయులు మరణించారు.
ఇదిలా ఉంటే ఈ జాబ్ రాకెట్లో యువకుల్ని మోసగించిన నలుగురిని భారత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాకు చెందిన కొందరు ఆర్మీ యూనిఫాం ధరించి, ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నామని తమని రక్షించాలని కోరుతున్న వీడియో వైరల్గా మారింది. దీంతో ఇలా చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్ సిద్ధమైంది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో కేరళ విద్యార్థులను మోసగించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధంలో తప్పుదోవ పట్టించిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి రష్యా చేయగలిగినదంతా చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!