BJP Mission 2024: సమయం లేదు మిత్రమా.. సమరానికి సిద్ధం కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
400 Days To Polls, Reach Out To All Voters, Says PM Modi At BJP Meet: ఢిల్లీలోొ జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ సమాయత్తం అవుతోంది. 2024, జూన్ వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగించింది. దీంతో పాటు ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు కేవలం 400 రోజులు మాత్రమే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకులెకు దిశానిర్ధేశం చేశారు. ఈ 400 రోజులు బీజేపీకి కీలకం అని సూచించారు. కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ పాదయాత్రను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.
Read Also: Nepal plane crash: నేపాల్ విమాన ప్రమాదానికి ముందు ఏయిర్హోస్టెస్ టిక్టాక్.. వీడియో వైరల్
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ 400 రోజుల్లో ప్రజలకు, ఓటర్లకు చేరువ కావాలని కోరారు. 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లపై దృష్టి పెట్టాలని మోదీ అన్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. వారికి చరిత్ర, గత ప్రభుత్వాలు ఏమి చేశాయో తెలియదని.. మనం వారికి అవగాహన కల్పించాలని, సుపరిపాలనలో భాగం కావడానికి వారికి సహయపడాలని మోదీ సూచించినట్లు వెల్లడించారు.
మోదీ, జేపీ నడ్డాల సారథ్యంలో 2024 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, మణిపూర్, గోవా ఎన్నికల్లో గెలిచామని.. ఆయన నేతృత్వంలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బలపడ్డామని వెల్లడించారు. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అమిత్ షా అన్నారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలం పెంచుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బీజేపీ ఎదుగుదలకు బాగుంటుందని ఆ పార్టీ భావిస్తోంది.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!