Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 Men Rob Car At Gunpoint In Delhi Tunnel: ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ కారుని అడ్డగించి, గన్తో బెదిరించి, డబ్బులు దోచుకుపోయారు. ఢిల్లీలోని 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రగతి మైదాన్ టన్నెల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు ఒక క్యాబ్ బుక్ చేసుకొని, గురుగ్రామ్కి బయలుదేరారు. రూ.2 లక్షల డబ్బులతో నిండిన ఒక బ్యాగ్ని డెలివరీ చేయడానికి వాళ్లు క్యాబ్లో వెళ్తున్నారు. ఆ క్యాబ్ ప్రగతి మైదాన్ టన్నెల్లోకి ప్రవేశించగానే.. రెండు బైక్ల మీద నలుగురు దుండగులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?
Also Read
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
- Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
ఒక చోట ఆ కారుని అడ్డగించి, ఇద్దరు బైక్ల నుంచి దిగారు. ఒకరు గన్తో బెదిరిస్తుండగా, మరొకరు డబ్బులతో నిండిన బ్యాగ్ని తీసుకున్నాడు. బ్యాగ్ చేతికి అందగానే.. అక్కడి నుంచి ఆ నలుగురు ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ టన్నెల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. దొంగల్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుండుగులు క్యాబ్లోని ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటి నుంచి వెంబడిస్తున్నారు? ఇందులో అంతర్గత వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. టన్నెల్ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచామని.. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నారని తెలిపారు. దోషులను పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
Vikarabad Crime: కోరిక తీర్చమని వివాహితని అడిగాడు.. దాబాకు తీసుకెళ్లి, మందు తాగిపించి..
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్ సక్సేనా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పుకొని.. ఢిల్లీ ప్రజల్ని సురక్షితంగా ఉంచే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు బాధ్యతల్ని అప్పగించాలన్నారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమైందన్న ఆయన.. మీకు చేతకాకపోతే తమకు బాధ్యతలు ఇవ్వాలన్నారు. నగర ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో తాము చూపిస్తామని ఛాలెంజ్ చేశారు.
LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi.
If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023
తాజావార్తలు
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
-
KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
-
Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!