Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 Men Rob Car At Gunpoint In Delhi Tunnel: ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ కారుని అడ్డగించి, గన్తో బెదిరించి, డబ్బులు దోచుకుపోయారు. ఢిల్లీలోని 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రగతి మైదాన్ టన్నెల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు ఒక క్యాబ్ బుక్ చేసుకొని, గురుగ్రామ్కి బయలుదేరారు. రూ.2 లక్షల డబ్బులతో నిండిన ఒక బ్యాగ్ని డెలివరీ చేయడానికి వాళ్లు క్యాబ్లో వెళ్తున్నారు. ఆ క్యాబ్ ప్రగతి మైదాన్ టన్నెల్లోకి ప్రవేశించగానే.. రెండు బైక్ల మీద నలుగురు దుండగులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
ఒక చోట ఆ కారుని అడ్డగించి, ఇద్దరు బైక్ల నుంచి దిగారు. ఒకరు గన్తో బెదిరిస్తుండగా, మరొకరు డబ్బులతో నిండిన బ్యాగ్ని తీసుకున్నాడు. బ్యాగ్ చేతికి అందగానే.. అక్కడి నుంచి ఆ నలుగురు ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ టన్నెల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. దొంగల్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుండుగులు క్యాబ్లోని ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటి నుంచి వెంబడిస్తున్నారు? ఇందులో అంతర్గత వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. టన్నెల్ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచామని.. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నారని తెలిపారు. దోషులను పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
Vikarabad Crime: కోరిక తీర్చమని వివాహితని అడిగాడు.. దాబాకు తీసుకెళ్లి, మందు తాగిపించి..
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్ సక్సేనా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పుకొని.. ఢిల్లీ ప్రజల్ని సురక్షితంగా ఉంచే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు బాధ్యతల్ని అప్పగించాలన్నారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమైందన్న ఆయన.. మీకు చేతకాకపోతే తమకు బాధ్యతలు ఇవ్వాలన్నారు. నగర ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో తాము చూపిస్తామని ఛాలెంజ్ చేశారు.
LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi.
If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023
తాజావార్తలు
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!