Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ
4 Men Rob Car At Gunpoint In Delhi Tunnel: ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ కారుని అడ్డగించి, గన్తో బెదిరించి, డబ్బులు దోచుకుపోయారు. ఢిల్లీలోని 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రగతి మైదాన్ టన్నెల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు ఒక క్యాబ్ బుక్ చేసుకొని, గురుగ్రామ్కి బయలుదేరారు. రూ.2 లక్షల డబ్బులతో నిండిన ఒక బ్యాగ్ని డెలివరీ చేయడానికి వాళ్లు క్యాబ్లో వెళ్తున్నారు. ఆ క్యాబ్ ప్రగతి మైదాన్ టన్నెల్లోకి ప్రవేశించగానే.. రెండు బైక్ల మీద నలుగురు దుండగులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఒక చోట ఆ కారుని అడ్డగించి, ఇద్దరు బైక్ల నుంచి దిగారు. ఒకరు గన్తో బెదిరిస్తుండగా, మరొకరు డబ్బులతో నిండిన బ్యాగ్ని తీసుకున్నాడు. బ్యాగ్ చేతికి అందగానే.. అక్కడి నుంచి ఆ నలుగురు ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ టన్నెల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. దొంగల్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుండుగులు క్యాబ్లోని ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటి నుంచి వెంబడిస్తున్నారు? ఇందులో అంతర్గత వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. టన్నెల్ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచామని.. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నారని తెలిపారు. దోషులను పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
Vikarabad Crime: కోరిక తీర్చమని వివాహితని అడిగాడు.. దాబాకు తీసుకెళ్లి, మందు తాగిపించి..
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్ సక్సేనా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పుకొని.. ఢిల్లీ ప్రజల్ని సురక్షితంగా ఉంచే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు బాధ్యతల్ని అప్పగించాలన్నారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమైందన్న ఆయన.. మీకు చేతకాకపోతే తమకు బాధ్యతలు ఇవ్వాలన్నారు. నగర ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో తాము చూపిస్తామని ఛాలెంజ్ చేశారు.
LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi.
If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!