Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Extortion Scam Instant Loan Apps Mafia Chinese Nationals Involved

Extortion Scam: రూ.500 కోట్ల ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం

Published Date :August 20, 2022 , 10:25 pm
By Venu Goapl Reddy
Extortion Scam: రూ.500 కోట్ల ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

instant loan apps mafia, Chinese Nationals Involved: రూ. 500 కోట్ల భారీ ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు సుమారుగా రెండు నెలల విచారణ తరువాత భారీ స్కామ్ ను ఛేదించారు. తక్షణ రుణాలు ఇచ్చి.. విపరీతమైన వడ్డీలు కట్టాల్సిందిగా ఈ ముఠా సామాన్య ప్రజలను వేధిస్తోందని పోలీసులు వెల్లడించారు. చైనా నుంచి వచ్చే సూచనలతో ఈ ముఠా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ భారీ స్కామ్ లో చైనా జాతీయుల ప్రమేయం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తేల్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నుంచి 22 మందిని అరెస్ట్ చేశారు. ఈ రుణాల స్కామ్ ద్వారా డబ్బును హవాలా, క్రిప్టో కరెన్సీల ద్వారా చైనా కు తరలిస్తున్నట్లు తేలింది.

అధిక వడ్డీలకు రుణాలు మంజూరు చేశారంటూ పలువురి నుంచి ఫిర్యాదులు అందాయని.. వడ్డీతో పాటు డబ్బులు పూర్తిగా చెల్లించినా.. మార్ఫింగ్ చేసిన వారి న్యూడ్ ఫోటోలను ఉపయోగించి ఈ ముఠా ఎక్కువ డబ్బులు వసూలు చేసేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ఈ ఫిర్యాదులన్నింటిని పరిగణలోకి తీసుకుంది. ఈ స్కామ్ లో దాదాపుగా 100 కన్నా యాప్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు ఇచ్చే ముందు ప్రజల నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మెషన్ ను యాప్ లు కోరుతున్నాయని.. వారి కాంటాక్ట్స్, ఫోటోలు, చాటింగ్, మెసేజ్ వివరాలను యాక్సెస్ పొందిన తర్వాత రుణాలు ఇస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా చైనా, హాంకాంగ్ లోని సర్వర్లకు వినియోగదారుల సెన్సిటివ్ వివరాలను అప్ లోడ్ చేసేదని తేలింది.

Also Read

  • Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
  • Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

Read Also: Actress Nakshathra: అర్థరాత్రి బస్సులో డ్రైవర్ నీచ పని.. ఆ నటి ఏం చేసిందంటే?

ఈ వివరాలు ఇచ్చిన తర్వాత నిమిషాల్లోనే బాధితుడి ఖాతాలో డబ్బులు జమయ్యేవని.. ఇలా రుణాలు తీసుకున్న తర్వాత ముఠా భయపెట్టడం ప్రారంభించేదని.. న్యూడ్ ఫోటోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించి ఎక్కువ డబ్బు వసూలు చేసేదని పోలీసులు వెల్లడించారు. ప్రజలు కూడా అవమానం భరించలేమనే ఉద్దేశ్యంతో వారు అడిగినంత ఇచ్చేవారని పోలీసులు వెల్లడించారు. రూ.5,000, రూ.10,000 రుణానికి బదులు రూ. లక్షల్లో చెల్లించాలని ఒత్తడి చేసేవారని దీంతో అనేక మంది ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఈ లోన్ యాప్ ముఠా అనేక ఖాతాలను ఉపయోగించేదని.. రోజుకు రూ. కోటి వరకు వీరి అకౌంట్లలోకి వచ్చేవని తెలుస్తోంది.

ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ నెట్ వర్క్ విస్తరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలతో పాటు 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది చైనీయులను గుర్తించామని.. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణ తర్వాత ఈ ముఠా రికవరీ కాల్ సెంటర్లను పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లకు మార్చారని.. ఈ స్కామ్ లో ఇప్పటి వరకు రూ.500 కోట్లకు పైగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chinese loan apps
  • Chinese Nationals involved in loan scam
  • Delhi police
  • Extortion Scam Busted
  • instant loan apps mafia

తాజావార్తలు

  • Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ

  • Crane Accident : శంకర్‌పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి

  • DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..

  • Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions