Tamil Nadu: గొంతులో చేప చిక్కుకుని జాలరి మృతి
- తమిళనాడులో విషాదం
- గొంతులో చేప చిక్కుకుని మత్స్యకారుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడుకు చెందిన ఒక జాలరి గొంతులో బతికి ఉన్న చేప అడ్డుపడి ప్రాణాలు కోల్పోయాడు. చెంగల్పట్టులోని మధురాంతకం సమీపంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చెంగల్పట్టుకు చెందిన 29 ఏళ్ల మణిగండన్ అనే యువకుడు స్థానిక సరస్సులో చేతులతో చేపలు పడుతున్నాడు. అయితే ఒక చేపను నోటిలో పెట్టుకుని.. ఇంకో చేపను పడుతున్నాడు. ఇంతలో నోటిలో ఉన్న చేప హఠాత్తుగా గొంతులోకి వెళ్లిపోయింది. గొంతు లోపలికి దూరి పోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. సహచరులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ఇది కూడా చదవండి: Vizag Mayor: మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్..! దేశం దాటిన కార్పొరేటర్లు..
మృతుడు అరయపక్కం గ్రామానికి చెందిన మణిగండన్గా గుర్తించారు. స్థానికంగా రోజువారీ కూలీగా పనిచేస్తుంటాడు. ఇతడికి చేతులతో చేపలు పట్టే అలవాటు ఉంది. నీటి మట్టాలు తక్కువగా ఉన్న కీళవలం సరస్సుకు వెళ్లి చేపలు పడుతుంటాడు. అయితే మంగళవారం సాయంత్రం ‘పనంగోట్టై’ అని పిలువబడే బతికి ఉన్న చేపను నోటితో కరిచిపెట్టాడు. ఈ చేప పదునైన రెక్కలు కలిగి ఉంటుంది. అయితే మరొక చేప కోసం.. ప్రయత్నిస్తుండగా పనంగోట్టై చేప గొంతులోకి దూరిపోవడంతో మణిగండన్ చనిపోయినట్లుగా స్థానికులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Union Cabinet: ఏపీకి గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. రూ.1,332 కోట్లతో..
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!