Union Cabinet: ఏపీకి గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. రూ.1,332 కోట్లతో..
- ఆంధ్రప్రదేశ్కు మరో గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం..
- రూ.1,332 కోట్లతో తిరుపతి – పాకాల – కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్డ్..
- ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ సమావేశం..
- ప్రధాని మోడీ, రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన రామ్మోహన్ నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Cabinet: ఆంధ్రప్రదేశ్కు మరో గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రూ.1,332 కోట్లతో తిరుపతి – పాకాల – కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.. తిరుపతి – పాకాల – కాట్పాడిల మధ్య మొత్తం 104 కిలో మీటర్ల మార్గంలో రూ.1,332 కోట్లతో డబ్లింగ్ పనులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది.. పీఎం గతిశక్తి పోర్టల్ ఆధారంగా రైల్వే నెట్వర్క్ను విశ్లేషించి అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్ను డబ్లింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఈ డబ్లింగ్ పనుల వల్ల కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లకు రద్దీ తగ్గుతుందని వెల్లడించారు.. అంతేకాదు.. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు, చంద్రగిరి కోటకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.. ఈ డబ్లింగ్ మార్గంలో మొత్తం 15 స్టేషన్లు, 17 పెద్ద వంతెనలు, 327 చిన్నవంతెనలు, 7 ఆర్వోబీలు, 30 ఆర్యూబీలు వస్తాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు..
Read Also: Rashi Khanna : బాలీవుడ్ సినిమాలు తీసే పద్ధతి మార్చుకోవాలి..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు… టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ, రైలు-రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.. తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే లైన్ను డబుల్ ట్రాక్గా అభివృద్ధి చేసేందుకు రూ.1,332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి, రైల్వే శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. ఈ ప్రాజెక్టు నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.. ఈ లైన్ డబ్లింగ్తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుంది. అంతేకాదు, విద్యా, వైద్య అవసరాల కోసం వెల్లూరుకు వెళ్లే ప్రయాణికులకు ఇది గొప్ప వనరు కానుంది అని వెల్లడించారు.. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కావడం ద్వారా పరిశ్రమల వృద్ధికి ఇది తోడ్పడనుంది.. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ సిమెంట్ మరియు స్టీల్ రంగాలకు మరింత చేయూతనివ్వబోతుంది అన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!