Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- స్టార్టప్ కమ్యూనిటీలో మరో విషాదం
- టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ బెనర్జీ (45) అకాల మరణం చెందారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన ఏ విధంగా చనిపోయారో తెలియదు అని పేర్కొంది. గుండెపోటుతో చనిపోయారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ కచ్చితమైన కారణం మాత్రం తమకు తెలియదు అని కంపెనీ పేర్కొంది. అమిత్ బెనర్జీ అకాల మరణం పట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్టార్టప్ కమ్యూనిటీలో వరుస విషాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
“మా వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు మేము ప్రకటించడం చాలా బాధాకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ సొల్యూషన్ పరిశ్రమగా మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. అమిత్ నాయకత్వంలో టేబుల్ స్పేస్ను నిర్మించింది, ” అని కంపెనీ ప్రతినిధి చెప్పారు. కుటుంబం, స్నేహితులు.. అమిత్ను తీవ్రంగా మిస్ అవుతున్నామని… ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
అమిత్ బెనర్జీ సెప్టెంబర్ 2017లో టేబుల్ స్పేస్ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్గా అందుబాటులోకి వచ్చింది. పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 1998-2002 మధ్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. జనవరి, 2004లో ఐటీ మేజర్ యాక్సెంచర్లో తన వృత్తిపరమైన వృత్తిని ప్రారంభించారు. సంస్థలో 13 సంవత్సరాల అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, కార్యకలాపాలకు బాధ్యత వహించారు. వృత్తిపరమైన అనుభవం రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదే టేబుల్ స్పేస్ను ప్రారంభించడానికి సహాయపడింది.
స్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు తీవ్ర దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయి. రెండు వారాల క్రితం ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్లో బైకింగ్ ట్రిప్లో గుండెపోటుతో మరణించారు. తాజాగా అమిత్ బెనర్జీ మరణం కూడా అదే తరహాలో ఉండడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!