Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- స్టార్టప్ కమ్యూనిటీలో మరో విషాదం
- టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ బెనర్జీ (45) అకాల మరణం చెందారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన ఏ విధంగా చనిపోయారో తెలియదు అని పేర్కొంది. గుండెపోటుతో చనిపోయారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ కచ్చితమైన కారణం మాత్రం తమకు తెలియదు అని కంపెనీ పేర్కొంది. అమిత్ బెనర్జీ అకాల మరణం పట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్టార్టప్ కమ్యూనిటీలో వరుస విషాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
“మా వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు మేము ప్రకటించడం చాలా బాధాకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ సొల్యూషన్ పరిశ్రమగా మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. అమిత్ నాయకత్వంలో టేబుల్ స్పేస్ను నిర్మించింది, ” అని కంపెనీ ప్రతినిధి చెప్పారు. కుటుంబం, స్నేహితులు.. అమిత్ను తీవ్రంగా మిస్ అవుతున్నామని… ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
అమిత్ బెనర్జీ సెప్టెంబర్ 2017లో టేబుల్ స్పేస్ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్గా అందుబాటులోకి వచ్చింది. పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 1998-2002 మధ్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. జనవరి, 2004లో ఐటీ మేజర్ యాక్సెంచర్లో తన వృత్తిపరమైన వృత్తిని ప్రారంభించారు. సంస్థలో 13 సంవత్సరాల అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, కార్యకలాపాలకు బాధ్యత వహించారు. వృత్తిపరమైన అనుభవం రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదే టేబుల్ స్పేస్ను ప్రారంభించడానికి సహాయపడింది.
స్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు తీవ్ర దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయి. రెండు వారాల క్రితం ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్లో బైకింగ్ ట్రిప్లో గుండెపోటుతో మరణించారు. తాజాగా అమిత్ బెనర్జీ మరణం కూడా అదే తరహాలో ఉండడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!