Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- స్టార్టప్ కమ్యూనిటీలో మరో విషాదం
- టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ బెనర్జీ (45) అకాల మరణం చెందారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన ఏ విధంగా చనిపోయారో తెలియదు అని పేర్కొంది. గుండెపోటుతో చనిపోయారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ కచ్చితమైన కారణం మాత్రం తమకు తెలియదు అని కంపెనీ పేర్కొంది. అమిత్ బెనర్జీ అకాల మరణం పట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్టార్టప్ కమ్యూనిటీలో వరుస విషాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
“మా వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు మేము ప్రకటించడం చాలా బాధాకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ సొల్యూషన్ పరిశ్రమగా మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. అమిత్ నాయకత్వంలో టేబుల్ స్పేస్ను నిర్మించింది, ” అని కంపెనీ ప్రతినిధి చెప్పారు. కుటుంబం, స్నేహితులు.. అమిత్ను తీవ్రంగా మిస్ అవుతున్నామని… ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
అమిత్ బెనర్జీ సెప్టెంబర్ 2017లో టేబుల్ స్పేస్ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్గా అందుబాటులోకి వచ్చింది. పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 1998-2002 మధ్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. జనవరి, 2004లో ఐటీ మేజర్ యాక్సెంచర్లో తన వృత్తిపరమైన వృత్తిని ప్రారంభించారు. సంస్థలో 13 సంవత్సరాల అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, కార్యకలాపాలకు బాధ్యత వహించారు. వృత్తిపరమైన అనుభవం రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదే టేబుల్ స్పేస్ను ప్రారంభించడానికి సహాయపడింది.
స్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు తీవ్ర దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయి. రెండు వారాల క్రితం ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్లో బైకింగ్ ట్రిప్లో గుండెపోటుతో మరణించారు. తాజాగా అమిత్ బెనర్జీ మరణం కూడా అదే తరహాలో ఉండడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..