Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- స్టార్టప్ కమ్యూనిటీలో మరో విషాదం
- టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ బెనర్జీ (45) అకాల మరణం చెందారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన ఏ విధంగా చనిపోయారో తెలియదు అని పేర్కొంది. గుండెపోటుతో చనిపోయారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ కచ్చితమైన కారణం మాత్రం తమకు తెలియదు అని కంపెనీ పేర్కొంది. అమిత్ బెనర్జీ అకాల మరణం పట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్టార్టప్ కమ్యూనిటీలో వరుస విషాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
“మా వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు మేము ప్రకటించడం చాలా బాధాకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ సొల్యూషన్ పరిశ్రమగా మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. అమిత్ నాయకత్వంలో టేబుల్ స్పేస్ను నిర్మించింది, ” అని కంపెనీ ప్రతినిధి చెప్పారు. కుటుంబం, స్నేహితులు.. అమిత్ను తీవ్రంగా మిస్ అవుతున్నామని… ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
అమిత్ బెనర్జీ సెప్టెంబర్ 2017లో టేబుల్ స్పేస్ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్గా అందుబాటులోకి వచ్చింది. పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 1998-2002 మధ్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. జనవరి, 2004లో ఐటీ మేజర్ యాక్సెంచర్లో తన వృత్తిపరమైన వృత్తిని ప్రారంభించారు. సంస్థలో 13 సంవత్సరాల అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, కార్యకలాపాలకు బాధ్యత వహించారు. వృత్తిపరమైన అనుభవం రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదే టేబుల్ స్పేస్ను ప్రారంభించడానికి సహాయపడింది.
స్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు తీవ్ర దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయి. రెండు వారాల క్రితం ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్లో బైకింగ్ ట్రిప్లో గుండెపోటుతో మరణించారు. తాజాగా అమిత్ బెనర్జీ మరణం కూడా అదే తరహాలో ఉండడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!