Amit Banerji: విషాదం.. టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- స్టార్టప్ కమ్యూనిటీలో మరో విషాదం
- టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు అమిత్ బెనర్జీ అకాల మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టేబుల్ స్పేస్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ బెనర్జీ (45) అకాల మరణం చెందారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన ఏ విధంగా చనిపోయారో తెలియదు అని పేర్కొంది. గుండెపోటుతో చనిపోయారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ కచ్చితమైన కారణం మాత్రం తమకు తెలియదు అని కంపెనీ పేర్కొంది. అమిత్ బెనర్జీ అకాల మరణం పట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్టార్టప్ కమ్యూనిటీలో వరుస విషాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
“మా వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు మేము ప్రకటించడం చాలా బాధాకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ సొల్యూషన్ పరిశ్రమగా మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. అమిత్ నాయకత్వంలో టేబుల్ స్పేస్ను నిర్మించింది, ” అని కంపెనీ ప్రతినిధి చెప్పారు. కుటుంబం, స్నేహితులు.. అమిత్ను తీవ్రంగా మిస్ అవుతున్నామని… ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
అమిత్ బెనర్జీ సెప్టెంబర్ 2017లో టేబుల్ స్పేస్ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్గా అందుబాటులోకి వచ్చింది. పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 1998-2002 మధ్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. జనవరి, 2004లో ఐటీ మేజర్ యాక్సెంచర్లో తన వృత్తిపరమైన వృత్తిని ప్రారంభించారు. సంస్థలో 13 సంవత్సరాల అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, కార్యకలాపాలకు బాధ్యత వహించారు. వృత్తిపరమైన అనుభవం రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదే టేబుల్ స్పేస్ను ప్రారంభించడానికి సహాయపడింది.
స్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు తీవ్ర దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయి. రెండు వారాల క్రితం ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్లో బైకింగ్ ట్రిప్లో గుండెపోటుతో మరణించారు. తాజాగా అమిత్ బెనర్జీ మరణం కూడా అదే తరహాలో ఉండడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!