Ram Navami: అయోధ్య ఆలయానికి 1,11,111 కిలోల లడ్డూలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Navami: శ్రీరామ నవమి సమీపిస్తుండటంతో అయోధ్య రామమందిరం ముస్తాబైంది. అయోధ్య నగర వ్యాప్తంగా యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. శ్రీరామ నవమి రోజు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ నవమి సందర్భంగా అయోధ్య రాముల వారికి ఏకంగా 1,11,111 కిలోల లడ్డూలను ప్రసాదంగా సమర్పించబోతున్నారు. దేవరహ హన్స్ బాబా ఈ భారీ లడ్డూను పంపనున్నట్లు దేవరహ హన్స్ బాబా ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు.
Read Also: Israel-Iran Conflict: ఇజ్రాయిల్కి అమెరికా షాక్.. ఇరాన్పై దాడిలో పాల్గొనమన్న బైడెన్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
లడ్డు ప్రసాదాలను ప్రతీ వారం కాశీ విశ్వనాథ ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయాలకు పంపిస్తున్నట్లు అతను వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా రోజున దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూను నైవేద్యానికి పంపినట్లు తెలిపారు. దాదాపుగా 500 ఏళ్ల తరువాత అయోధ్యలో శ్రీరాముడి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్తాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా 100కి పైగా ఎల్ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. రామ నవమికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఎండలకి భక్తుల పాదాలు కాలిపోకుండా కార్పెట్ సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!