New Record: టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్లు వసూలు.. రైల్వే హిస్టరీలోనే రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Record in Railway Fines: సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ అరుదైన రికార్డును సాధించింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి రూ. 100 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసింది. దీంతో భారతీయ రైల్వేల్లో అద్భుతమైన రికార్డ్ సృష్టించిన తొలి డివిజన్ గా ముంబై నిలిచింది. ఏప్రిల్ 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేేసింది. గతేడాది ఇది రూ. 60 కోట్లుగా ఉంది. టికెట్ లేకుండా ప్రయాణాలు చేయవద్దని సెంట్రల్ రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది. అయితే ఇవన్నీ పట్టకుండా టికెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో పెద్ద ఎత్తున ఫైన్ లను వసూలు చేస్తున్నారు అధికారులు.
Read Also: Hong Kong Model: మోడల్ను హత్య చేసి.. ముక్కలు చేసి సూప్ వండిన మాజీ భర్త
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
టికెట్ చెకింగ్ చేయడం ద్వారా ప్రయాణికులకు మరింతగా సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని, రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులు, టికెట్ తీసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగచేస్తున్నారనే ఫిర్యాదుతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని దీంతో ఈ రికార్డు సాధ్యం అయిందని సెంట్రల్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ వెల్లడించారు. మొత్తం ఫైన్లను సబర్భన్ లలో టికెట్ లేని ప్రయాణికలు నుంచి, ఇతర సాధారణ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వాళ్ల నుంచి వసూలు చేశారు.
ముంబై డివిజన్ లో 77 రైల్వే స్టేషన్లలో, 1200 మంది టికెట్ ఎగ్జామినర్ల( టీటీఈ)లు ఉన్నారు. వీరంతా టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై నిఘా పెడుతున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారి బాడీ లాంగ్వేజ్ ద్వారానే వారిని గుర్తిస్తున్నామని, నిరంతం నిఘా వల్ల వారు ఎలా వ్యవహరిస్తారో తెలుసుకుని, గుర్తిస్తున్నామని టీటీఈలు చెబుతున్నారు. ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 25,781 మంది ప్రయాణికుల నుంచి రూ. 87.43 లక్షల జరిమానా, ఫస్ట్ క్లాస్ కోచ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన 1.45 లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ. 5.05 కోట్ల జరిమానాతో కలిపి మొత్తంగా రూ. 100 కోట్ల జరిమానా విధించినట్లు సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 లో ముంబై డివిజన్ 15.73 లక్షల మంది నుంచి రూ. 76.82 కోట్లను వసూలు చేసింది.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..