New Record: టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్లు వసూలు.. రైల్వే హిస్టరీలోనే రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Record in Railway Fines: సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ అరుదైన రికార్డును సాధించింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి రూ. 100 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేసింది. దీంతో భారతీయ రైల్వేల్లో అద్భుతమైన రికార్డ్ సృష్టించిన తొలి డివిజన్ గా ముంబై నిలిచింది. ఏప్రిల్ 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేేసింది. గతేడాది ఇది రూ. 60 కోట్లుగా ఉంది. టికెట్ లేకుండా ప్రయాణాలు చేయవద్దని సెంట్రల్ రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది. అయితే ఇవన్నీ పట్టకుండా టికెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో పెద్ద ఎత్తున ఫైన్ లను వసూలు చేస్తున్నారు అధికారులు.
Read Also: Hong Kong Model: మోడల్ను హత్య చేసి.. ముక్కలు చేసి సూప్ వండిన మాజీ భర్త
Also Read
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
టికెట్ చెకింగ్ చేయడం ద్వారా ప్రయాణికులకు మరింతగా సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని, రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులు, టికెట్ తీసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగచేస్తున్నారనే ఫిర్యాదుతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని దీంతో ఈ రికార్డు సాధ్యం అయిందని సెంట్రల్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ వెల్లడించారు. మొత్తం ఫైన్లను సబర్భన్ లలో టికెట్ లేని ప్రయాణికలు నుంచి, ఇతర సాధారణ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వాళ్ల నుంచి వసూలు చేశారు.
ముంబై డివిజన్ లో 77 రైల్వే స్టేషన్లలో, 1200 మంది టికెట్ ఎగ్జామినర్ల( టీటీఈ)లు ఉన్నారు. వీరంతా టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై నిఘా పెడుతున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే వారి బాడీ లాంగ్వేజ్ ద్వారానే వారిని గుర్తిస్తున్నామని, నిరంతం నిఘా వల్ల వారు ఎలా వ్యవహరిస్తారో తెలుసుకుని, గుర్తిస్తున్నామని టీటీఈలు చెబుతున్నారు. ఎయిర్ కండిషన్డ్ లోకల్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 25,781 మంది ప్రయాణికుల నుంచి రూ. 87.43 లక్షల జరిమానా, ఫస్ట్ క్లాస్ కోచ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన 1.45 లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ. 5.05 కోట్ల జరిమానాతో కలిపి మొత్తంగా రూ. 100 కోట్ల జరిమానా విధించినట్లు సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 లో ముంబై డివిజన్ 15.73 లక్షల మంది నుంచి రూ. 76.82 కోట్లను వసూలు చేసింది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!