Delhi: తుపాకీ గురి పెట్టి టయోటా ఫార్చ్యూనర్ కార్ దొంగతనం.. వైరల్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toyota Fortuner car stolen at gunpoint: నడిరోడ్డుపై గన్ పాయింట్ లో ఓ వ్యక్తి తన టయోటా ఫార్చ్యూనర్ కారును కోల్పోయాడు. దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు యజమానికి గన్ గురిపెట్టి కారును ఎత్తుకెళ్లారు. నైరుతి ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో గన్ గురిపెట్టి 35 ఏళ్ల వ్యక్తి నుంచి కారును దొంగిలించారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
శనివారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ కు ఝరేరా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారి-8పై ఈ దోపిడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఎరుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి కారు యజమానిని గన్ తో బెదిరించడం కెమెరాల్లో రికార్డ్ అయింది. కార్ యజమాని దగ్గర నుంచి కార్ తాళాలు తీసుకుని అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పరారయ్యారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
Read Also: Venkatesh Netha: బీజేపీ డ్రామాల పార్టీ.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు
యూపీలోని మీరట్ జిల్లాకు చెందిన రాహుల్ అనే వ్యక్తికి సంబంధించిన ఫార్చ్యూనర్ కారును ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి టయోటా ఫార్య్చూనర్ ను దోచుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు నిందితులపై సెక్షన్ 397 (దోపిడీ, లేదా దోపిడీ, హత్య, గాయపరిచే ప్రయత్నం), ఐపీసీ 34 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
#WATCH | A carjacking incident at gunpoint occurred in the national capital's Delhi Cantt area at around 5:20am on October 29th. Case registered, investigation underway.
(CCTV visuals) pic.twitter.com/bbGLQL2D3U
— ANI (@ANI) October 30, 2022
తాజావార్తలు
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!