Bengaluru: ఎడతెరిపిలేని వర్షాలు.. కూలిన భారీ బిల్డింగ్.. ముగ్గురు మృతి
- వారం రోజులుగా బెంగళూరులో ఎడతెరిపిలేని వర్షాలు
- కూలిన భారీ బిల్డింగ్.. ముగ్గురు మృతి
- మరో 15 మంది చిక్కుకున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే 27 ఏళ్ల రికార్డును చెరిపివేస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా నిర్మాణంలో భారీ అంతస్తు బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది. మృతుల్లో ఒకరిని బీహార్కు చెందిన హనుమంతు (25)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఒక మహిళ సహా తొమ్మిది మందిని రక్షించారు.
భవనం కూలిన తూర్పు బెంగళూరులోని బాబుసాపాళ్య దగ్గరకు రెస్క్యూ టీమ్ చేరుకుంది. శిధిలాలను తొలగించి చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించారు. పలువురు చిక్కుకున్నట్లు వార్తలు విపిస్తున్నాయి. ముమ్మరంగా సహాయ చర్యలు సాగుతున్నాయి.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి 186.2 మి.మీ వర్షం పాతం నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. అక్టోబర్ 1, 1997లో 178.9 మి.మీ వర్షం పాతం నమోదైంది. తిరిగి 27 ఏళ్ల తర్వాత ఆ రికార్డును మంగళవారం తిరగరాసింది. ఈ రోజంతా కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
యలహంకలో తీవ్ర వరదలు..
యలహంకలో కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వారం వ్యవధిలో వరదలకు గురవడం ఇది రెండోసారి. కాంప్లెక్స్లోని నివాసితులు మంగళవారం ఉదయం నడుము లోతులో నీరులో మునిగిపోయారు. కార్లు మరియు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
బెంగళూరులో ఎటుచూసినా నీళ్లే ఉన్నాయి. అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. వరద నీటిలో ప్రజాప్రతినిధుల ఇళ్లు కూడా మునిగిపోయాయి.
ఇది కూడా చదవండి: Minister Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు.. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!