దీపావళీ పండగ సందర్భంగా సోషల్ మీడియా సెలబ్రిటీల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్టార్ హీరోల ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, తన వారసులతో దీపావళీ జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య తారక రామారావు సాంప్రదాయ దుస్తులతో కనిపించి కనువిందు చేశారు. తారక్ ఎప్పుడు తన వారసుల ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకోడు. ఇలా పండగవేళ ముగ్గురు రామ్’లు కనిపించడంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఒక షో లో ఎన్టీఆర్ తన వారసుల గురించి మాట్లాడుతూ.. అభయ్ రామ్ చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ, భార్గవ్ రామ్ చేసే అల్లరి ప్రపంచంలో ఎవరు చేయలేరని, చిన్నప్పుడు తానూ కూడా ఇలాగే చేసేవాడినని చెప్పుకొచ్చాడు.