హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లాక్డౌన్ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా రానుంది. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్ సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్ఆర్ తదితరులు నటించారు.