Trivikram తాజాగా మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’తో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని సాధించాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ మూవీ సంగతి పక్కన పెడితే.. త్వరలోనే త్రివిక్రమ్ మరో రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నాడనే టాక్ నడుస్తోంది. అది కూడా ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ తోనట !
Read Also : KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?
అగ్ర నటీనటులందరూ బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలను చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో స్టార్ డైరెక్టర్స్ సైతం పలు స్క్రిప్ట్ లతో వారిని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. త్రివిక్రమ్ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్లను కలిశారట. ఎన్టీఆర్ తో ఒక సినిమా, అల్లు అర్జున్ మరో సినిమా చేయాలని భావిస్తున్న త్రివిక్రమ్, దాని గురించే ఇద్దరు స్టార్స్ తో విడివిడిగా చర్చించారని తెలుస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుత ప్రాజెక్ట్లు, రాబోయే ప్రాజెక్ట్ల షూటింగ్ షెడ్యూల్ల ఆధారంగా త్రివిక్రమ్ తన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ త్రివిక్రమ్తో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రెండు ప్రాజెక్ట్ల స్క్రిప్ట్లను త్రివిక్రమ్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. 2022 ముగిసేలోపు మహేష్ బాబు సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఖాతాలో ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, అనిల్ రావిపూడి లతో సినిమాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా చేస్తూనే అట్లీ, బోయపాటి శ్రీనుతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.