కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ సినిమాలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పునీత్ రాజ్కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతోన్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
పునీత్ ఆర్మీ ఆఫీసర్గా నటించిన ‘జేమ్స్’ మూవీలో హీరోయిన్గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు చక్కని స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా శ్రీకాంత్తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.