Tollywood top 10: టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Top 10 Highest Pre Release Business Movies: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు తెలుగు లేదా దక్షిణాది సినిమాలు అని మన సినిమాలను పిలిచిన వారే ఇప్పుడు మనది ఇండియన్ సినిమా అని పిలుస్తున్నారు. అలా మన స్థాయి పెరగడమే కాదు మన సినిమాల బడ్జెట్ తద్వారా మన సినిమాల మార్కెట్ లు కూడా భారీగా పెరిగాయి. ఇక ఈ క్రమంలో టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న సినిమాల విశేషాలు మీకోసం.
Also Read: Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?
Also Read
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్గా 'శ్రీనివాస మంగాపురం' టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
- Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్గా సుమంత్.. 'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానం సంపాదించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పలువురు హాలీవుడ్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా మొత్తం మీద అన్ని భాషల్లో కలిపి 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక రెండో స్థానం బాహుబలి సెకండ్ పార్ట్ దక్కించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా 352 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక మూడవ స్థానంలో ప్రభాస్ హీరోగా సుజిత్ సింగ్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన సాహో సినిమా నిలిచింది. ఆ సినిమా 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక తర్వాత స్థానంలో ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమా నిలిచింది.
ఈ సినిమా 240 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక ఆ తర్వాత స్థానం కూడా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమానే దక్కించుకోవడం గమనార్హం. ఈ సినిమా 202 కోట్ల 80 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సహా అమితాబచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా 187 కోట్ల పాతిక లక్షల బిజినెస్ జరుపుకుంది. ఆ తర్వాత స్థానంలో పుష్ప మొదటి భాగం నిలిచింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా 134 కోట్ల 90 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా 131 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అదే విధంగా మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సినిమా 124 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా 123 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
నోట్: ఈ సమాచారం ఇంటర్నెట్లో వివిధ సోర్స్ ల నుండి సేకరించింది. ఈ సమాచారాన్ని ఎన్టీవీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.
తాజావార్తలు
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
-
Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
-
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
-
Israel: వెస్ట్ బ్యాంక్లో భారీ ఆపరేషన్కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!