Tollywood: ఏడాదిలో మూడు వంద కోట్ల సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: ఓటిటిలో సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం బాగా తగ్గింది. బాగుంది అంటే తప్ప ఇల్లు వదలి సినిమాలకోసం థియేటర్స్ గుమ్మం తొక్కటం లేదు. ఒక వేళ సినిమాలు తీసి రిలీజ్ చేసినా దారుణమైన నష్టాలు చవి చూడవలసిని పరిస్థితి. ఈ తరుణంలో ఒకే సంస్థ నిర్మించిన మూడు సినిమాలు 2022లో వంద కోట్లను వసూలు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం. ఆ సినిమాలే ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ2’, ‘ధమాకా’. వీటిని నిర్మించిన సంస్థ ఎఎఎ ఆర్ట్స్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. దీని అధినేత అభిషేక్ అగర్వాల్. వీటిలో ముందుగా విడుదలైన సినిమా ‘ద కాశ్మీర్ ఫైల్స్’. మార్చి 11, 2022లో విడుదలై ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. 15 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం దాదాపు 340 కోట్లను వసూలు చేసింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి నటించిన ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకుడు. కశ్మీర్ పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఆ తర్వాత పీపుల్స్ మీడియా సంస్థతో కలసి నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో నిర్మించిన ‘కార్తికేయ2’ సినిమా ఆగస్ట్ 13న విడుదలైంది. అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలై వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించింది. 25 నుంచి 30 కోట్లతో రూపొందిన ఈ సినిమా కూడా దాదాపు 120 కోట్ల వసూళ్ళను సాధించింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థతో కలసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ‘ధమాకా’ సినిమా డిసెంబర్ 23న విడుదలైంది. రవతేజ కెరీర్ లో ఇది తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. దీంతో అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ సంస్థ ఒకే ఏడాది మూడు వంద కోట్ల సినిమాలను అందించిన సంస్థగా టాలీవుడ్ చరిత్రపుటల్లో చోటు సంపాదించింది. ఇక ఎఎఎ సంస్థతో కలసి ‘కార్తికేయ2’, ‘ధమాకా’ నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థ కూడా రెండు వంద కోట్ల సినిమాలు అందించిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. సో ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా సంస్థలకు అభినందనలు. ఈ సంస్థలు 2023లో కూడా అదే ఊపును కొనసాగించి హిట్ సినిమాలను అందించాలని కోరుకుందాం.
Also Read
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..