చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. శర్వా సినీ కెరీర్ లో 38వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై అత్యంత భారీ బడ్జెట్తో, సాంకేతిక ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంపత్ నంది, రాధామోహన్ కాంబోలో సిటిమార్ తర్వాత వస్తున్న రెండవ సినిమా ఇది.
Also Read : SSMB : రాజమౌళి మహాభారతం.. ముగ్గురు హీరోలు ఫిక్స్
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలో శర్వానంద్ మునుపెన్నడు కనిపించను లుక్ లో కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా సినిమాలో శర్వా కు జోడీగా ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఆన్ బోర్డ్ చేసారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈ మరో హీరోయిన్ ను కూడా తీసుకున్నట్టు ప్రకటించారు. ఖిలాడీ, రామా బాణం సినిమాలలో నటించిన భామ డింపుల్ హయతిని శర్వా సినిమా కోసం తీసుకున్నట్టు ప్రకటించారు మేకర్స్. తెలంగాణ నేపథ్యంలో పిరియాడికల్ యాక్షన్ నేపధ్యంలో రానున్నఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తీసుకురాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం శర్వా నారి నారి నడుమ మురారి, అలాగే యువీ క్రియేషన్స్ లోను మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశకు చురుకున్నాయి. త్వరలోనే సంపత్ నంది సినిమా రెగ్యులర్ షూట్ లో జాయిన్ కానున్నాడు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో శర్వా 38కు సంగీతం అందిస్తున్నాడు.