Vijayendar Reddy: ఆ విషయాలపై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana State Film Chamber: సంక్రాంతి కానుకగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో పాటు ‘దిల్’ రాజు నిర్మించిన అనువాదచిత్రం ‘వారసుడు’ సైతం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి అనువాద చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వరాదంటూ ఎగ్జిబిటర్స్ ను కోరింది. ఈ విషయమై మంగళవారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో చర్చ జరిగింది. ఈ వివరాలను సంస్థ ట్రెజరర్, ప్రముఖ ఎగ్జిబిటర్ విజయేందర్ రెడ్డి తెలియచేశారు.
ఆయన మాట్లాడుతూ, ”డబ్బింగ్ సినిమాలను ఆపడం అనేది కుదరదు. మన సినిమాలు ఇతర భాషల్లోనూ, ఇతర భాషా చిత్రాలు మన తెలుగులోనూ ఎంతో కాలంగా డబ్ అవుతున్నాయి. అయితే… మా తొలి ప్రాధాన్యం ఎప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాలకే ఉంటుంది. ఇదే సమయంలో గుర్తించాల్సిన మరో విషయం ఏమంటే… ఇది వ్యాపారంతో కూడుకున్న పరిశ్రమ. మాకు రెగ్యులర్ గా ఏ పంపిణీదారుడు ఎక్కువగా సినిమాలను ఇస్తారో అతనితోనే మా ప్రయాణం సాగుతుంటుంది. అతను ఇచ్చిన సినిమాలకే మేం ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు మా వ్యాపార భాగస్వామితో ఉండే అనుబంధం దృష్ట్యా వారిచ్చే సినిమాలను ప్రదర్శిస్తాం” అని అన్నారు. అలానే ఈ రోజు జరిగిన మీటింగ్ లో ‘లైగర్’ విషయమూ చర్చకు వచ్చిందని చెప్పారు. ఈ సినిమాను తెలంగాణాలో పంపిణీ చేసిన వరంగల్ శ్రీను… మూవీ పరాజయం పాలైన కారణంగా కొంత మొత్తాన్ని నిర్మాతల నుండి వెనక్కి ఇప్పించాల్సిందిగా ఛాంబర్ ను కోరారని, ఈ విషయాన్ని దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ దృష్టికి తాము తీసుకెళ్ళి, వారు ఇచ్చే మొత్తాన్ని ఛాంబర్ లో డిపాజిట్ చేయమని కోరబోతున్నామని విజయేందర్ రెడ్డి చెప్పారు. పూరి జగన్నాథ్ బిజీగా ఉన్న కారణంగా ఆయన నుండి అతి త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘లైగర్’ సినిమా ద్వారా నష్టపోయిన వారందరికీ పూరి జగన్నాథ్ ఇచ్చే మొత్తాన్ని పంచాలనుకుంటున్నామని అన్నారు. ఇది డిమాండ్ కాదని, కేవలం పూరి జగన్నాథ్ కు తమ వినతి అని ఆయన చెప్పారు.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో 'రష్మిక మందన్న'
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!