NTV Telugu Site icon

Tollywood: స్టార్ హీరోల సినిమాలకి స్పెషల్ పర్మిషన్స్… ఇక షో వేసుకోవచ్చు

Tollywood

Tollywood

సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఈ రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల సినిమా రిలీజ్ అంటేనే ఆ హంగామా ఉండడం మామూలే కానీ ఈసారి చిరు-బాలయ్యల మధ్య పోటీ ఉంది కాబట్టి 2023 సంక్రాంతి మరింత స్పెషల్ గా మారింది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ వార్ ని ఎంజాయ్ చెయ్యడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

Read Also: RRR: ఈ ఫోటోలో చరణ్ ఎక్కడా? ఆ ఫోటో తీసింది ఆయనే కదా…

ఈ జోష్ ని మరింత పెంచుతూ స్పెషల్ షోకి పర్మిషన్స్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఈ రెండు సినిమాలకి ఎర్లీ మార్నింగ్ 4కి షోస్ వేసుకోవచ్చు అని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం G.O విడుదల చేసింది. దీంతో సంక్రాంతి సినిమాల సందడి మరింత ఎక్కువ అయ్యింది. టికెట్ రేట్స్ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకి రేట్ పెంచుకునే వెసలుబాటు ఉంది. టికెట్ రేట్స్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ దాదాపు 50 రూపాయల వరకూ టికెట్ రేట్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి వెసలుబాటుని కల్పిస్తే మన సినిమాలకి మరింత కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల విడుదలకి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి జగన్ ప్రభుత్వం స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ విషయంలో మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి.

Read Also: Veera Simha Reddy: వాహ్… కటౌట్ అదిరిందయ్యా…