బుక్ మై షో దోపిడీని అరికట్టాలి : తమ్మారెడ్డి భరద్వాజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తెలుగు నిర్మాతలు ఎప్పటి నుండో కోరుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాలని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. ప్రస్తుతం ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు దారుణంగా ప్రేక్షకుడిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒక్కో టిక్కెట్ కు 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని, అందులో కేవలం ఐదారు రూపాయలను మాత్రమే ఎగ్జిబిటర్స్ కు ఇస్తున్నాయని, మిగిలిన మొత్తం ఎవరు తింటున్నారో తెలియదని అన్నారు. బుక్ మై షో దోపిడీని వెంటనే అరికట్టాలని, వాటిని వీలైనంత త్వరగా సాగనంపాలని, దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాటును ప్రభుత్వాలు చేయాలని చెప్పారు.
Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
Also Read
అయితే ఆన్ లైన్ టిక్కెటింగ్ ను ప్రభుత్వం కాకుండా ఎఫ్.డి.సి, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త నిర్వహణలో జరిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్సుల గురించి ఎఫ్.డి.సి. పట్టించుకుంటే, నిర్మాతలకు రావాల్సిన డబ్బుల గురించి ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత వహిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని చెబుతూ, ‘థియేటర్ హౌస్ ఫుల్ అయినా, డీసీఆర్ లలో కలెక్షన్లు చూపించడం లేదని, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం వస్తే అలాంటి అక్రమాలకు చోటు ఉండదని, డీసీఆర్ ను ఎగ్జిబిటర్ పంపే లోపే ఆన్ లైన్ లో తమ చిత్రం ఎంత కలెక్ట్ చేసింది నిర్మాతకు తెలిసిపోతుందని, అందుకే ఈ విధానాన్ని స్వాగతించామ’ని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
తాజావార్తలు
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
-
Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..