బుక్ మై షో దోపిడీని అరికట్టాలి : తమ్మారెడ్డి భరద్వాజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తెలుగు నిర్మాతలు ఎప్పటి నుండో కోరుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాలని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. ప్రస్తుతం ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు దారుణంగా ప్రేక్షకుడిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒక్కో టిక్కెట్ కు 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని, అందులో కేవలం ఐదారు రూపాయలను మాత్రమే ఎగ్జిబిటర్స్ కు ఇస్తున్నాయని, మిగిలిన మొత్తం ఎవరు తింటున్నారో తెలియదని అన్నారు. బుక్ మై షో దోపిడీని వెంటనే అరికట్టాలని, వాటిని వీలైనంత త్వరగా సాగనంపాలని, దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాటును ప్రభుత్వాలు చేయాలని చెప్పారు.
Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
అయితే ఆన్ లైన్ టిక్కెటింగ్ ను ప్రభుత్వం కాకుండా ఎఫ్.డి.సి, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త నిర్వహణలో జరిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్సుల గురించి ఎఫ్.డి.సి. పట్టించుకుంటే, నిర్మాతలకు రావాల్సిన డబ్బుల గురించి ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత వహిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని చెబుతూ, ‘థియేటర్ హౌస్ ఫుల్ అయినా, డీసీఆర్ లలో కలెక్షన్లు చూపించడం లేదని, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం వస్తే అలాంటి అక్రమాలకు చోటు ఉండదని, డీసీఆర్ ను ఎగ్జిబిటర్ పంపే లోపే ఆన్ లైన్ లో తమ చిత్రం ఎంత కలెక్ట్ చేసింది నిర్మాతకు తెలిసిపోతుందని, అందుకే ఈ విధానాన్ని స్వాగతించామ’ని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!