Supreme Court Angry on Udhayanidhi Stalin Comments: సనాతన ధర్మం గురించి సినీ హీరో, డీఎంకే నేత – తమిళనాడు మంత్రి, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని అన్నారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్న స్టాలిన్ కామెంట్ల మీద దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. నిజానికి ఈ అంశం మీద పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Jayaprada: కోర్టులో లొంగిపోయిన జయప్రద
దీన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ అంశం మీద తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఉన్నా సరే మీ ఆ హక్కులు దుర్వినియోగం చేశారు, కానీ ఇప్పుడు మీరు రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో మీకు తెలియదా? అని సుప్రీం ప్రశ్నించింది. మీరేమీ సామాన్య వ్యక్తి కాదు కదా, ఓ మంత్రి పదవిలో ఉన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడాలో సరిచూసుకోవాల్సిన అవసరం లేదా అని సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆ తరువాత తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.