Sumanth Ashwin: నా వల్ల కాదు.. ప్రభాస్ సినిమా వల్లే నష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింది ‘మస్కా’. ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ, నిర్మాతగా తన ప్రస్థానాన్ని ఆపేశారు. అసలెందుకు ఎమ్మెస్ రాజుకి ఈ పరిస్థితి వచ్చింది? నిర్మాతగా ఎందుకు తన జర్నీని ముగించారు? అనే చర్చలు తెరమీదకి వచ్చినప్పుడు.. తనయుడు సుమంత్ అశ్విన్ తో చేసిన సినిమాలు తేడా కొట్టడం వల్లేనని కామెంట్స్ వచ్చాయి.
అయితే, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా సుమంత్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో చేసిన ‘‘7 డేస్ 6 నైట్స్’’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వల్లే తండ్రి నష్టపోయారన్న వ్యాఖ్యల్ని తోసిపుచ్చాడు. ప్రభాస్ తో చేసిన ‘పౌర్ణమి’ సినిమా తేడా కొట్టడం వల్లే భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ‘‘వర్షం తర్వాత అదే కాంబినేషన్ లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో, మా నాన్న ఉన్నదంతా తీసుకొచ్చి ‘పౌర్ణమి’కి పెట్టేశారు. సెట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు వెచ్చించారు. ఆ సినిమాకి ప్రశంసలైతే వచ్చాయి కానీ, బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఆ దెబ్బకు భారీ నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలు నాన్న కెరీర్ పై బాగా ఎఫెక్ట్ చూపించాయి. ఆ సినిమా పెద్ద దెబ్బే కొట్టింది’’ అని సుమంత్ వెల్లడించాడు.
Also Read
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
- Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
ఆ తర్వాత కొత్త హీరోని పెట్టి చేసిన ‘వాన’ వల్ల కూడా నష్టాలొచ్చాయని సుమంత్ తెలిపాడు. సొంత బ్యానర్ లో తాను ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదని, అసలు తాను హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికే తన తండ్రి నష్టాల్లో కూరుకుపోయారని అన్నాడు. కాబట్టి, తన వల్లే నాన్న నష్టపోయాడయని వచ్చిన కామెంట్స్ లో వాస్తవం లేదని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!