Aakhari Poratam: శ్రీదేవి, నాగార్జున ‘ఆఖరి పోరాటం’ చేయడానికి కారణం!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి సరసన నాయికగా నటించిన భామతో తనయుడు రొమాన్స్ చేయడం అన్నది నిస్సందేహంగా సదరు హీరోయిన్ కు ఓ క్రెడిట్ అనే చెప్పాలి. తల్లితోనూ, ఆమె కూతురితోనూ నాయకునిగా నటిస్తే అది తప్పకుండా ఆ హీరోకు క్రెడిట్ కాకమానదు. మొదటి విషయానికి వస్తే – తండ్రి, కొడుకు ఇద్దరితోనూ రొమాన్స్ చేసిన నాయికలు ఉన్నారు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగానే కనిపిస్తున్నారు. కానీ,ఆ రోజుల్లో తండ్రి హీరోయిన్ తో తనయుడు రొమాన్స్ చేయడమంటే ఓ విశేషంగా ఉండేది. అందునా శ్రీదేవి లాంటి ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ తో ఆ ఫీట్ చేస్తే నిజంగానే అది మరింత విశేషమే కదా! ఏయన్నార్ సరసన అనేక చిత్రాలలో మురిపించిన శ్రీదేవి, ఆయన తనయుడు నాగార్జునతోనూ జోడీ కట్టి అలరించారు. అలా నాగార్జునతో శ్రీదేవి నటించిన తొలి చిత్రం ‘ఆఖరి పోరాటం’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన ‘ఆఖరి పోరాటం’ జనాన్ని అలరించింది. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇళయరాజా బాణీల్లో మరింతగా మురిపించింది. 1988 మార్చి 12న ‘ఆఖరి పోరాటం’ జనం ముందు నిలచి అలరించింది.
‘ఆఖరి పోరాటం’ కథ విషయానికి వస్తే – ఇందులో నాయికదే పైచేయి. సీబీఐ ఆఫీసర్ ప్రవల్లిక చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, అన్యాయాలకు పాల్పడేవారికి సింహస్వప్నంగా ఉంటుంది. అనంతానంత స్వామి మతం, మూఢనమ్మకాల ముసుగుతో జనాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. దేశానికే అధ్యక్షుడై నిరంకుశ పాలన సాగించాలని ఆ స్వామిజీ యోచన. దీనిని ప్రవల్లిక తెలుసుకుంటుంది. అయితే స్వామిజీ భక్తులు ప్రభుత్వ యంత్రాంగంలోనూ, రాజకీయాల్లోనూ ఉంటారు. వారి ద్వారా స్వామిజీ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని, అల్లకల్లోలాలు సృష్టిస్తూ ఉంటాడు. ఈ పరిశోధనలో ప్రవల్లికకు విహారి పరిచయం అవుతాడు. అతనంటే ప్రవల్లికకు అభిమానం కలుగుతుంది. తరువాత అది ప్రేమగా మారుతుంది. ఎప్పటికప్పుడు తన పజిల్స్ తో ఫోన్ లో క్లూస్ ఇస్తూ కనుక్కోమని చెబుతూ ఉంటుంది. కానీ, విహారి వెతుకులాటలో అతనికి సునాదమాల పరిచయం అవుతుంది. విహారి కన్నవారు సైతం స్వామిజీ భక్తులే! ఆ విధంగానూ స్వామిజీ తన పనులు తాను చేసుకుంటూ పోతుంటాడు. అయితే ప్రవల్లికకు, విహారి సాయం అందిస్తాడు. అతను సైతం స్వామిజీని అనుమానిస్తాడు. చివరకు స్వామిజీ ఆటకట్టించడానికి ప్రవల్లికతో కలసి విహారి రంగంలోకి దిగుతాడు. ఆ పోరాటంలో ప్రవల్లిక ప్రాణాలు కోల్పోతోంది. ఆ స్వామిజీని విహారి అంతమొందించడంతో కథ ముగుస్తుంది.
Also Read
ఈ చిత్రంలో సుహాసిని, అమ్రిష్ పురి, జగ్గయ్య, సత్యనారాయణ, చంద్రమోహన్, నూతన్ ప్రసాద్, సుత్తివేలు, విజయన్, పి.జె.శర్మ, పేకేటి శివరామ్, ఆనంద్ మోహన్, ప్రదీప్ శక్తి, విమల్ రాజ్, లీ, జయంతి, మమత, నిర్మల, కల్పనారాయ్, అభిలాష, మాస్టర్ రాజేశ్, మాస్టర్ మీస్ రాజ్, మాస్టర్ జయకృష్ణ నటించారు. ఈ చిత్రానికి జంధ్యాల మాటలు రాశారు. ఇళయరాజా బాణీలకు అనువుగా వేటూరి, జొన్నవిత్తుల పాటలు పలికించారు. ఇందులోని “తెల్లచీరకు తకధిమి తపనలు…”, “స్వాతిచినుకు సందెవేళలో…”, “గుండెలో తకిట తకిట…”, “అబ్బ దీని సోకు…”, “ఎప్పుడు ఎప్పుడు…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘తెల్లచీరకు తకధిమ…” పాటను లతామంగేష్కర్, బాలుతో కలసి గానం చేయడం విశేషం! అంతకు ముందు 1955లో ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘సంతానం’ చిత్రంలో తొలిసారి “నిదుర పోరా తమ్ముడా…” తెలుగు పాటను పాడిన లతా మంగేష్కర్, దాదాపు 33 ఏళ్ళ తరువాత అక్కినేని తనయుడు నాగార్జున సినిమాలో తెలుగుపాట పాడడం మరింత విశేషం!
‘ఆఖరి పోరాటం’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత నాగార్జున, శ్రీదేవి జంటగా అశ్వనీదత్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘గోవిందా…గోవిందా…’ నిర్మించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేదు. ‘గోవిందా గోవిందా’కు ముందు హిందీ చిత్రం ‘ఖుదాగవా’లోనూ శ్రీదేవితో, నాగార్జున జోడీ కట్టారు. అలా అక్కినేని నటవంశంలో తండ్రి, తనయుడుతో కలసి నటించి శ్రీదేవి మురిపించారు. ఆమె కంటే ముందు కొందరు హీరోయిన్లు తండ్రితో కలసి నటించిన వారు తనయులతోనూ జోడీకట్టి సందడి చేసిన సందర్భాలున్నాయి. అయితే వారెవరూ శ్రీదేవి స్థాయిలో ఆల్ ఇండియాలో సక్సెస్ సాధించిన వారు కారు. ఏది ఏమైనా ‘ఆఖరి పోరాటం’ చిత్రం శ్రీదేవి, నాగార్జున అభిమానులకు ఓ మరపురాని చిత్రంగా ఈ నాటికీ నిలచే ఉంది.
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!