Kalki 2898 AD: 40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమా స్టార్ట్ చేశారు: ప్రభాస్ పెద్దమ్మ
- ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు
- కళకళలాడుతున్న థియేటర్లు
- 40 ఏళ్ల క్రితమే కల్కి సినిమా స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shyamala Devi Comments on Kalki 2898 AD: జూన్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. వరుసగా సలార్, కల్కి హిట్ అవ్వడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవద్దుల్లేకుండా పొయాయి. అయితే కల్కి సినిమాపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు కల్కి సినిమాను స్టార్ట్ చేశారని శ్యామలా దేవి తెలిపారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్యామలా దేవి మాట్లాడుతూ… ‘కృష్ణం రాజు గారు కల్కి అనే పేరు పెట్టి ఓ సినిమా స్టార్ట్ చేశారు. దాదాపుగా 40 ఏళ్ల క్రితం మొదలెట్టారు. కొన్ని షూట్ చేసిన సీన్స్ కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయి. ఆ సినిమాకు ఎంఎం కీరవాణి గారు ఓ సాంగ్ కూడా చేశారట. ఇప్పటికీ ఆ సాంగ్ కీరవాణి దేవుడి ఇంట్లో ఉంటుంది. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అనుకోకుండా ఇప్పుడు ఆ పేరుతో సినిమా వచ్చింది’ అని చెప్పారు.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
Also Read: Kalki 2898 AD Collections: బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ ప్రభంజనం.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక!
కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఫలితాన్ని ఆశించి ఏదీ చేయరని శ్యామలా దేవి తెలిపారు. ‘కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఎదుటువారికి చాలా మర్యాద ఇస్తారన్నారు. అతిథులకు అన్ని రకాల వంటలు ఇంట్లోనే స్వయంగా చేయిస్తారు. కృష్ణం రాజు గారు స్వయంగా రుచి చూస్తారు. కృష్ణం రాజు ఏం తింటారో చిత్ర యూనిట్కు మొత్తం అదే భోజనం ఉంటుంది. వీఐపీ, లైట్ మ్యాన్ అంటూ తేడా ఉండదు. ప్రకాష్ రాజ్ గారికి రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!