Kalki 2898 AD: 40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమా స్టార్ట్ చేశారు: ప్రభాస్ పెద్దమ్మ
- ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు
- కళకళలాడుతున్న థియేటర్లు
- 40 ఏళ్ల క్రితమే కల్కి సినిమా స్టార్ట్
Shyamala Devi Comments on Kalki 2898 AD: జూన్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. వరుసగా సలార్, కల్కి హిట్ అవ్వడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవద్దుల్లేకుండా పొయాయి. అయితే కల్కి సినిమాపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు కల్కి సినిమాను స్టార్ట్ చేశారని శ్యామలా దేవి తెలిపారు. ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్యామలా దేవి మాట్లాడుతూ… ‘కృష్ణం రాజు గారు కల్కి అనే పేరు పెట్టి ఓ సినిమా స్టార్ట్ చేశారు. దాదాపుగా 40 ఏళ్ల క్రితం మొదలెట్టారు. కొన్ని షూట్ చేసిన సీన్స్ కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయి. ఆ సినిమాకు ఎంఎం కీరవాణి గారు ఓ సాంగ్ కూడా చేశారట. ఇప్పటికీ ఆ సాంగ్ కీరవాణి దేవుడి ఇంట్లో ఉంటుంది. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అనుకోకుండా ఇప్పుడు ఆ పేరుతో సినిమా వచ్చింది’ అని చెప్పారు.
Also Read
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
Also Read: Kalki 2898 AD Collections: బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ ప్రభంజనం.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక!
కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఫలితాన్ని ఆశించి ఏదీ చేయరని శ్యామలా దేవి తెలిపారు. ‘కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఎదుటువారికి చాలా మర్యాద ఇస్తారన్నారు. అతిథులకు అన్ని రకాల వంటలు ఇంట్లోనే స్వయంగా చేయిస్తారు. కృష్ణం రాజు గారు స్వయంగా రుచి చూస్తారు. కృష్ణం రాజు ఏం తింటారో చిత్ర యూనిట్కు మొత్తం అదే భోజనం ఉంటుంది. వీఐపీ, లైట్ మ్యాన్ అంటూ తేడా ఉండదు. ప్రకాష్ రాజ్ గారికి రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం’ అని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!