Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Servant Eeshwari Blame Aishwarya Rajinikanth For Not Increasing Her Salary: సూపర్స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరగడం, ఇంట్లో పని చేసే ఈశ్వరి అనే పనిమనిషే ఈ దొంగతనానికి పాల్పడటం, మార్చి 31వ తేదీన పోలీసులు ఆమెను పట్టుకోవడం.. అంతా తెలిసిందే! ఈశ్వరిని పట్టుకున్న అనంతరం ఈ దొంగతనం ఎందుకు చేశావని పోలీసులు విచారించగా.. దిమ్మతిరిగే వాంగ్మూలం ఇచ్చింది. ఐశ్వర్య చాలా పెద్ద పిసినారి అని, 18 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ జీతం పెంచడం లేదన్న కోపంతోనే ఈ దొంగతనానికి పాల్పడ్డానంటూ బాంబ్ పేల్చింది.
Gold Theft : నగలు చూస్తున్నట్లు నాటకం.. 15తులాల బంగారం చోరీ
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
పోలీసుల విచారణలో ఈశ్వరి మాట్లాడుతూ.. ‘‘నేను గత 18 ఏళ్లుగా ఐశ్వర్య ఇంట్లో పని చేస్తున్నాను. ఐశ్వర్య పిల్లల బాగోగులతో పాటు మరెన్నో పనులు చూసుకుంటున్నాను. వాళ్లు చెప్పిన ప్రతీ చిన్న పని చేస్తూనే వస్తున్నాను. అయినా సరే.. వాళ్లు నాకు నెలకు కేవలం రూ.30 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు. వాళ్ల దగ్గర ఎంతో డబ్బున్నా.. నాకు మాత్రం జీతం పెంచలేదు. ఈ రూ.30 వేలతో నేను ఎలా బ్రతకాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? తమ అవసరాల కోసం ఎంతో ఖర్చు చేసుకుంటారు కానీ, ఇంట్లో వాళ్ల పనులన్నీ చేసి పెడుతున్న నాకు మాత్రం జీతం పెంచట్లేదు. జీతం తక్కువగా ఇస్తున్నారనే కోపంతోనే.. దొంగతనం చేశాను. ఒకవేళ నా పనికి తగ్గ మంచి జీతం ఇచ్చి ఉంటే, దొంగతనం ఎందుకు చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. మొదట తాను చిన్న చిన్న దొంగతనాలు చేసేదాన్నని, అప్పుడు దొరికిపోలేదని తెలిపింది. ఆ ధైర్యంతోనే ఈసారి నగలు దొంగలించానని కుండబద్దలు కొట్టింది.
CM KCR Live.. Emotional Speech : నాజీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశా
కాగా.. ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పనిమనిషి ఈశ్వరి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా.. 100 బంగారం ముక్కలు, 30 గ్రాముల డైమండ్ ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తులు లభ్యమయ్యాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. తన కంప్లైంట్లో ఐశ్వర్య ఇచ్చిన ఆభరణాల లిస్ట్లో కంటే, ఈశ్వరి ఇంట్లో ఎక్కువ నగలు దొరికాయి. వీటిని చూశాక.. గతంలో ఈశ్వరి చేసిన చిన్న చిన్న దొంగతనాల బాగోతం కూడా బయటపడింది. అంతేకాదు.. ఈశ్వరికి చెన్నైలోని షోలింగనల్లూరు ప్రాంతంలో రూ.1 కోటి విలువ చేసే ఇల్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..