Indrasena: జర్నలిస్ట్ రాసిన కథతో ‘శాసనసభ’ చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్నలిస్ట్ గా, ఫిల్మ్ పీఆర్వోగా రాఘవేంద్రరెడ్డి దాదాపు పాతిక సంవత్సరాలు పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలానే ఆయన తన అనుభవాన్ని రంగరించి రాసిన ఓ కథ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. అదే ‘శాసనసభ’. నటుడు ఇంద్రసేన ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన ఈ కథను వేణు మడికంటి దర్శకత్వంలో తలసీరామ్ సాస్పని, షణ్ముగం సాస్పని నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ నాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
Also Read
- Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
- Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
- Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కు రెడీ!
- Dhurandhar : నెట్ఫ్లిక్స్లో 'ధురంధర్' ప్రపంచ రికార్డు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్ర కథానాయకుడు ఇంద్రసేన పుష్కరకాలంగా నటుడిగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంతో మంచి సెటప్ కుదిరింది. ఈ సినిమా ఇంద్రసేనతో పాటు టీమ్ అందరికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ ”కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంతో రచయిత రాఘవేంద్రరెడ్డి మంచి కమర్షియల్ కథ ఇచ్చారు. నాకోసమే ఈ కథను తయారుచేసిన ఆయనకు నేను జీవితాంతం ఋణపడి వుంటాను. నాకు ఎటువంటి ఇమేజ్ లేకున్నా నాతో ఇంత బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను నా జీవితంలో మరిచిపోలేను. ఈ ‘శాసనసభ’ నా కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది” అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఐశ్వర్యరాజ్ భకుని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, జబర్దస్త్ అప్పారావు, అనీష్ కురువిల్లా, అమిత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సోమవారం జరిగిన మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు చిన్నికృష్ణ, నిర్మాత, ఎమ్ఎల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, హీరోయిన్ ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, జగదీశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీకృష్ణ, భూషణ్, మహేష్, మయాంక్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
-
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!