‘సర్కారు వారి పాట’ సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ టీజర్ ను మహేశ్ బాబు బర్త్ డే బ్లాస్టర్ గా రిలీజ్ చేశారు. ఇలా వచ్చిందో లేదో తక్కువ సమయంలోనే పది మిలియన్ల వ్యూస్ తో సంబరం చేసింది. సాయంత్రానికి పద్దెనిమిది మిలియన్ల మైలు రాయి దాటి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ లెక్కన కొద్ది రోజులకే ఏదో రీతిన ‘సర్కారు వారి పాట’ రికార్డులు బద్దలు కొట్టేలా ఉందని చెప్పొచ్చు.
‘సర్కార్ వారి పాట’ బ్లాస్టర్ ఓపెనింగ్ లోనే “ఇందు మూలంగా యావన్మంది జనానికి తెలియజేయడమేమనగా…” అంటూ పాత పంథాలో ఊళ్ళలో సర్కారు వారి పాట పాడే రీతిన టేకాఫ్ తీసుకోవడం దర్శకుడు పరశురామ్ క్రియేటివిటీని చాటి చెప్పింది. ఇక బ్లాస్టర్ లో హీరో కారు దిగి, “ఇఫ్ ఏ టైగర్ డేట్స్ ఏ ర్యాబిట్… హౌ ఇట్ విల్ బి?” అనే డైలాగ్ అభిమానులను ఇట్టే పట్టేసింది. అవే మాటలను సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటూ మహేశ్ ఫ్యాన్స్ పరవశించిపోతున్నారు. అదే సీన్ లో ఒకణ్ణి చితక్కొట్టాక “సేమ్… ఇఫ్ యు మిస్ ఇంట్రెస్ట్… యు విల్ గెట్ యువర్ డేట్…” అనే పదాలు సైతం ఉరకలు వేయిస్తున్నాయి. అంతేనా… అంటే ఇంకా చాలా ఉంది… “పడుకొనే ముందు ప్రతిరోజూ… దిష్టి తీయడం మరచిపోకండి…” ఈ పదాలు హీరోయిన్ కీర్తి సురేశ్ పెదాలు దాటకుండానే వినిపిస్తాయి. అమ్మాయి జడలోని పూలను చూసి, “ఏమోయ్ కిశోర్… ఓ ఐదారు మూరలు ఉండవవీ…”అంటూ మహేశ్ పలికిన మాటలు సైతం మజా చేస్తున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకంగా జనవరి 13న ‘సర్కారు వారి పాట’ జనం ముందు నిలుస్తుందనీ ఈ బ్లాస్టర్ లో బల్లగుద్ది మరీ చెప్పారు. ఇన్ని ముచ్చట్లతో నిండిన బ్లాస్టర్ భలేగా సందడి చేస్తోంది.
Also Read
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
“శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు” చిత్రాలను బాగా గమనిస్తే మహేశ్ బాబు “జనం కోసమే మనం…” అన్న తీరున సాగుతున్నట్టు ఇట్టే కనిపిస్తుంది. అదే తీరున ఆయన తండ్రి కృష్ణ సైతం నటించేసి రాజకీయాల్లో అడుగుపెట్టి అప్పట్లో ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. మరి మహేశ్ బాబు మనసులో ఏముందో కానీ, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అంటూ ‘ప్రభుత్వం’నే టైటిల్ లో తగిలించుకున్నారు. మరి ఇందులో ఏమైనా పొలిటికల్ పంచెస్ ఉంటాయేమో చూడాలి. ‘సర్కారు వారి పాట’ టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు బ్లాస్టర్ చూశాక, ఆ ఆసక్తి మరింత పెరుగుతోంది. మరి మహేశ్ బాబుతో దర్శకుడు పరశురామ్ ‘సర్కారు వారి పాట’ను ఎలా పాడిస్తారో చూద్దాం.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!