దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం దక్కింది. వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న ఆస్కార్స్ 96 సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సందర్భంగా 398 మంది కొత్త మెంబర్స్ ని అకాడెమీ, జ్యూరీలోకి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10,817 మంది మెంబర్స్ అకాడెమి జ్యూరీ లిస్టులో ఉన్నారు. లేటెస్ట్ గా జ్యూరీలో యాడ్ అయిన 398లో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. సౌత్ ఆసియా వాళ్లకి ఎక్కువ స్థానాలు లభించాయి. ఇందులో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ లు ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్ లు జ్యూరీ మెంబర్స్ అవ్వడంతో ఇండియన్ మూవీ లవర్స్ మరియు మెగా-నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
Read Also: Rajamouli : ఆ ఒక్క యాడ్ కోసం రాజమౌళి తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా…?
ఇండియా నుంచి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ లతో పాటు మరికొందరికి కూడా జ్యూరీ మెంబర్స్ గా చోటు లభించింది. ప్రస్తుతం ఉన్న 10,817 మందిలో 9375 మంది మాత్రమే వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి ఓటు వేయనున్నారు. అయితే ఈ లిస్టులో రాజమౌళి లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా అంత దూరం వెళ్లింది అంటే జక్కన ప్లానింగ్, అలాంటిది ఆయన టీం మెంబర్స్ కి జ్యూరీలో చోటు దక్కింది కానీ జక్కన కూడా మాత్రం దక్కలేదు. ఇప్పుడే ఆస్కార్స్ లో తన ప్రయాణం మొదలుపెట్టిన రాజమౌళి, SSMB 29 సినిమాతో తన స్థాయి ఏంటో ప్రపంచానికి మరోసారి తెలియజేయనున్నాడు.