హాస్యంతో చెలరేగిన రేలంగి నరసింహారావు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో ‘గురువు గారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావు పేరే! తరువాత చప్పున ఆయన శిష్యగణం కూడా మన స్మృతిపథంలో మెదలుతారు. వారిలో కోడి రామకృష్ణ ముందుగా కనిపిస్తారు. వెనువెంటనే రేలంగి నరసింహారావు గుర్తుకు వస్తారు. ఆ తరువాతే ఎవరైనా! అలా గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు దాసరి శిష్యులు. రేలంగి నరసింహారావు తెలుగులోనే కాదు కన్నడనాట కూడా తనదైన బాణీ పలికించడం విశేషం. కామెడీతో కబడ్డీ ఆడేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించారు నరసింహారావు. ప్రస్తుతం ఆయన ‘ఊ అంటావా మామా…ఊఊ అంటావా మామా…’ అనే హారర్ కామెడీని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.
రేలంగి నరసింహారావు 1951 సెప్టెంబర్ 30న పాలకొల్లులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ కళలంటే ఆసక్తి. ఫోటోగ్రఫి అంటే నరసింహారావుకు ఇష్టం. ఇక చదువుకొనే రోజుల్లో తన క్లాస్ మేట్ కోడి రామకృష్ణతో కలసి పలు నాటకాలు వేశారు. తమ ఊరివారయిన దాసరి నారాయణరావు చిత్రసీమలో ఉండడంతో కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు మనసులు సైతం సినిమా రంగంవైపు ఆకర్షితమయ్యాయి. 1971లో బియస్సీకి స్వస్తి చెప్పి రేలంగి నరసింహారావు మద్రాసు చేరారు. తొలుత దర్శకుడు బి.వి.ప్రసాద్ వద్ద అప్రెంటిస్ గా ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’ సినిమాకు పనిచేశారు. ఆ తరువాత చలం హీరోగా రూపొందిన ‘ఊరికి ఉపకారి’ చిత్రానికి దర్శకుడు కె.యస్.ఆర్.దాస్ వద్ద కూడా అసోసియేట్ గా సాగారు. ఆ పై 1973లో ‘సంసారం- సాగరం’కు దాసరి వద్ద చేరారు. అప్పటి నుంచీ తాను ‘చందమామ’తో డైరెక్టర్ అయ్యే దాకా దాసరి వద్దే పనిచేశారు. తొలి చిత్రం ‘చందమామ’ నిరాశ కలిగించడంతో రేలంగిని ఆయన మిత్రులు కోడి, రవిరాజా పినిశెట్టి ప్రోత్సహించారు. మిత్రుల ప్రోత్సాహంతో ‘నేను- మా ఆవిడ’ తెరకెక్కించి విజయం సాధించారు. వరుసగా రేలంగి తీసిన “ఏమండోయ్ శ్రీమతిగారు, ఇల్లంతా సందడి” సినిమాలు సైతం ఆకట్టుకున్నాయి. దాంతో రేలంగి నరసింహారావు డైరెక్టర్ గా సెటిల్ అయిపోయారు.
Also Read
రేలంగి నరసింహారావు హాస్యం భలేగా పండించారు. ఆయన చిత్రాలలో రాజేంద్రప్రసాద్ ఎక్కువగా నటించారు. కేవలం కామెడీయే కాకుండా ఏయన్నార్ తో ‘దాగుడుమూతల దాంపత్యం’, శోభన్ బాబుతో ‘సంసారం’ వంటి సెంటిమెంట్ మూవీస్ కూడా తీశారు రేలంగి. కృష్ణంరాజుతో ‘యమధర్మరాజు’ అనే యాక్షన్ సినిమానూ తెరకెక్కించారు. రేలంగి దర్శకత్వంలో రూపొందిన ‘ఇద్దరు కిలాడీలు’తోనే సుమన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అయితే ఆయనకు హాస్యచిత్రాలే సక్సెస్ చూపించాయి. ‘ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీస్’, ‘ఎదురింటి మొగుడు- పక్కింటి పెళ్ళాం’ చిత్రాలు తెలుగులో ఘనవిజయం సాధించాయి. వాటిని కన్నడలో రేలంగి నరసింహారావు దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. ఆ చిత్రాలు కన్నడనాట కూడా విజయం సాధించడంతో అక్కడా నరసింహారావు బిజీ అయిపోయారు. ఆయన 75వ చిత్రంగా 2016లో ‘ఎలుకా మజాకా’ వెలుగు చూసింది. ఈటీవీ వారికి కొన్ని టీవీ సీరియల్స్ రూపొందించారు.
రేలంగి నరసింహారావు ఎప్పుడూ బిజీగా ఉండేందుకే ప్రయత్నించేవారు. ఓ వేళ ఏ పనీ లేకపోతే గురువు దాసరి నారాయణరావు వద్ద గడిపేవారు. దాసరి చివరలో రూపొందించిన కొన్ని చిత్రాలకు రేలంగి నరసింహారావు గురువు వద్ద మళ్ళీ అసోసియేట్ గా పనిచేయడం విశేషం! ఏదేమైనా గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న రేలంగి నరసింహారావు ఇప్పటికీ తన దరికి చేరిన అవకాశాలను వినియోగించుకుంటూనే ఉన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!