SSMB28: త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. బాలీవుడ్ స్టార్ నటి రంగంలోకి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rani Mukherji To Play Key Role In SSMB28: త్రివిక్రమ్ సినిమాల్లో చూసుకుంటే.. కామన్గా ఒక పాయింట్ ఉంటుంది. అదే.. కీలకమైన మహిళ పాత్ర. ఈ రోల్ కోసం ఆయన బాగా పేరుగడించిన ప్రముఖ నటీమణుల్నే ప్రత్యేకించి మరీ ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకి ఉన్న బలం, అందులో ఎవరు ఇమడగలరన్న సామర్థ్యాలతో పాటు ఆ పాత్ర వన్నె తీసుకురాగల సీనియర్ భామల్ని సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తోన్న SSMB28 సినిమా కోసం కూడా ఓ క్రేజీ భామని రంగంలోకి దింపాడని సమాచారం. ఈసారి దక్షిణాది నుంచి కాకుండా.. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చాడని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరనుకుంటున్నారా? రాణీ ముఖర్ఖీ.

Also Read
- Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!... ఈ వారమే ఓటీటీలోకి సూర్య 'కరుప్పు'
- Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
- MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక... సాయి పల్లవి చేజారినట్టే ?
- Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
ఒకప్పుడు హీరోయిన్గా బాలీవుడ్లో చక్రం తిప్పిన రాణీ ముఖర్జీ.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అది కూడా రెగ్యులర్గా కాదు, తనకు తగ్గ స్క్రిప్ట్ దొరికినప్పుడే! వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కాస్త జోరు తగ్గించిన మాట వాస్తవమే కానీ, ఆమె క్రేజ్ మాత్రం తరిగిపోలేదు. అందుకే, మహేశ్ సినిమా కోసం త్రివిక్రమ్ ఏరికోరి మరీ ఆమెను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఆమెను తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. మహేశ్తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయా ఇండస్ట్రీలో పేరుగడించిన నటీనటుల్ని సెలెక్ట్ చేస్తున్నాడు. తాను రాసుకున్న పాత్రకి రాణీ ముఖర్జీ సెట్ అవుతుందని, ఆమె వల్ల అక్కడ సినిమాకి క్రేజ్ కూడా కలిసొస్తుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. మరి, ఇది నిజమా? కాదా? అనేది తేలాల్సి ఉంది.
Bigg Boss-6: ఆదిరెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?
కాగా.. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ వచ్చిపడింది. అందుకు తగినట్టుగానే.. భారీతనంతో ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!