SSMB28: త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. బాలీవుడ్ స్టార్ నటి రంగంలోకి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rani Mukherji To Play Key Role In SSMB28: త్రివిక్రమ్ సినిమాల్లో చూసుకుంటే.. కామన్గా ఒక పాయింట్ ఉంటుంది. అదే.. కీలకమైన మహిళ పాత్ర. ఈ రోల్ కోసం ఆయన బాగా పేరుగడించిన ప్రముఖ నటీమణుల్నే ప్రత్యేకించి మరీ ఎంపిక చేసుకుంటాడు. ఆ పాత్రకి ఉన్న బలం, అందులో ఎవరు ఇమడగలరన్న సామర్థ్యాలతో పాటు ఆ పాత్ర వన్నె తీసుకురాగల సీనియర్ భామల్ని సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తోన్న SSMB28 సినిమా కోసం కూడా ఓ క్రేజీ భామని రంగంలోకి దింపాడని సమాచారం. ఈసారి దక్షిణాది నుంచి కాకుండా.. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చాడని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరనుకుంటున్నారా? రాణీ ముఖర్ఖీ.

Also Read
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
- Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! 'భాయ్జాన్'కు ఏమైంది?
- Yadhu Vamsi: 'నా కొడుకు సాధించాడు'.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
- Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ఒకప్పుడు హీరోయిన్గా బాలీవుడ్లో చక్రం తిప్పిన రాణీ ముఖర్జీ.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అది కూడా రెగ్యులర్గా కాదు, తనకు తగ్గ స్క్రిప్ట్ దొరికినప్పుడే! వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి కాస్త జోరు తగ్గించిన మాట వాస్తవమే కానీ, ఆమె క్రేజ్ మాత్రం తరిగిపోలేదు. అందుకే, మహేశ్ సినిమా కోసం త్రివిక్రమ్ ఏరికోరి మరీ ఆమెను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఆమెను తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. మహేశ్తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయా ఇండస్ట్రీలో పేరుగడించిన నటీనటుల్ని సెలెక్ట్ చేస్తున్నాడు. తాను రాసుకున్న పాత్రకి రాణీ ముఖర్జీ సెట్ అవుతుందని, ఆమె వల్ల అక్కడ సినిమాకి క్రేజ్ కూడా కలిసొస్తుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. మరి, ఇది నిజమా? కాదా? అనేది తేలాల్సి ఉంది.
Bigg Boss-6: ఆదిరెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?
కాగా.. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ వచ్చిపడింది. అందుకు తగినట్టుగానే.. భారీతనంతో ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!